సౌర వెలుగులకు ససేమిరా
ఇళ్లపై సౌర విద్యుత్ ఏర్పాటుకు ముందుకొస్తున్న సామాన్యులకు నిరాశ తప్పడం లేదు. ప్రభుత్వం ఖరారు చేసిన ధరలపై సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రైవేట్ సోలార్ సంస్థలు ససేమిరా అంటున్నాయి. రాష్ట్రంలో ఇళ్లు, కార్యాలయాలు,
రూఫ్టాప్ల ఏర్పాటు పనులను నిలిపివేసిన సోలార్ సంస్థలు
టీఎస్ రెడ్కో ఖరారు చేసిన ధరలతో నష్టం వస్తుందని వాదన
ఉత్పత్తి వ్యయం పెరిగిందని.. రేట్లు పెంచాలని డిమాండ్
ఈనాడు, హైదరాబాద్: ఇళ్లపై సౌర విద్యుత్ ఏర్పాటుకు ముందుకొస్తున్న సామాన్యులకు నిరాశ తప్పడం లేదు. ప్రభుత్వం ఖరారు చేసిన ధరలపై సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రైవేట్ సోలార్ సంస్థలు ససేమిరా అంటున్నాయి. రాష్ట్రంలో ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల భవనాలపై(రూఫ్టాప్) రాయితీపై సౌరవిద్యుత్ ఏర్పాటు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం(2021-22) కోసం గత జనవరిలో రూఫ్టాప్ ధరలను ‘తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’(టీఎస్ రెడ్కో) టెండర్ల ద్వారా ఖరారు చేసింది. ఒక కిలోవాట్కు రూ.52 వేల ధరను నిర్ణయించింది. వినియోగదారులు రాయితీ పోను రూ.37,330 చెల్లించాల్సి ఉంటుంది. రాయితీని కేంద్రం భరిస్తుంది. ఇదే విధంగా 2, 3, 4, 5, 10.. ఇలా వివిధ కిలోవాట్ల ధరలను టెండర్ల ద్వారా నిర్ణయించారు. ఇవే ధరలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లోనూ అమలు చేయాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది. ఈ ఏడాది 25 వేల కిలోవాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల సౌర విద్యుత్ ఏర్పాటుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతించింది. కానీ, జనవరి నుంచి ఇప్పటివరకూ కేవలం 1,800 కిలోవాట్ల సామర్థ్యం గలవి(7.2 శాతం) మాత్రమే ఏర్పాటు చేశారు. టెండర్ల ద్వారా ఖరారు చేసిన ధరలకు సౌర విద్యుత్ ఏర్పాటుకు సోలార్ సంస్థలు విముఖత చూపుతున్నాయి. సామగ్రి, ధరలు పెరిగాయనీ.. పైగా బేసిక్ కస్టమ్ డ్యూటీ(బీసీడీ)ని కేంద్రం పెంచిందని చెబుతున్నాయి. కిలో వాట్కు మరో రూ.8 వేలు అదనంగా చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. టెండర్లను ఖరారు చేసి నాలుగు నెలలే అయిందని.. అప్పుడే ధరలను పెంచడం సాధ్యం కాదని టీఎస్ రెడ్కో వాదిస్తోంది. ఈ అంశంపై ఈ నెల 23న కేంద్ర నూతన, సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ(ఎంఎన్ఆర్ఈ)తో చర్చించాలని సంస్థ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లోని ధరలనూ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. సోలార్ కంపెనీలు సహకరించకపోతే తెలంగాణకు కేటాయించిన 25 వేల కిలోవాట్ల సౌరవిద్యుత్ను ఇతర రాష్ట్రాలకు కేంద్రం మళ్లిస్తుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
దిగుమతులు తగ్గించాలని సుంకం వడ్డింపు
సౌర ఫలకాలను కంపెనీలు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడి నుంచి దిగుమతి తగ్గించాలని.. స్వదేశీ తయారీ, వినియోగం పెంచాలనే ఉద్దేశంతో ఫలకాల దిగుమతిపై కేంద్రం బేసిక్ కస్టమ్ సుంకం(బీసీడీ)ని 10 నుంచి 40 శాతానికి పెంచింది. దేశీయంగా ఫలకాల లభ్యత తక్కువగా ఉందని, దిగుమతి సుంకం పెంచడం వల్ల తాము ధరలు పెంచాల్సి వస్తోందని జున్నా సోలార్ సంస్థ సీఎండీ జున్నా శేఖర్రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. 5 కిలోవాట్ సామర్థ్యం గల రూఫ్టాప్ సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీకి 150 కిలోల వరకూ స్టీల్ వాడతారు. గతంలో స్టీల్ ధర కిలోకు రూ.45 ఉండేది. ఇప్పుడు రూ.75కి చేరింది. అల్యూమినియం 40 కిలోలు కావాలి. దీని ధర కిలోకు రూ.140 నుంచి రూ.150కి పెరిగింది. ఈ కారణంగా ఒక కిలో వాట్ సామర్థ్యం గల ప్యానెళ్ల ధర సగటున రూ.8 వేలు పెరిగిందని.. అందువల్ల ప్రస్తుత ధరలకు సౌర విద్యుత్ ఏర్పాటు సాధ్యపడదని ప్రభుత్వానికి కంపెనీలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!