రెవెన్యూశాఖ దో‘భూ’చులాట
యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి: జనం ఇబ్బందులకు పరిష్కరం చూపాల్సిన ప్రజావాణిని భూ సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్న సమస్యలు ధరణిలో ఐచ్ఛికాలు లేక పెండింగ్ పడిపోతున్నాయి
భూ సమస్యలపై ప్రజావాణికి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
విస్తీర్ణంలో కోతలు, పాసు పుస్తకాల మంజూరుపైనే ఎక్కువ
తహసీల్దార్ వద్దకు వెళ్లమంటున్న కలెక్టర్లు
కలెక్టర్ల దగ్గరకే వెళ్లండంటున్న తహసీల్దార్లు
విసిగివేసారుతున్న బాధితులు
యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి: జనం ఇబ్బందులకు పరిష్కరం చూపాల్సిన ప్రజావాణిని భూ సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్న సమస్యలు ధరణిలో ఐచ్ఛికాలు లేక పెండింగ్ పడిపోతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. వాటిపై ‘ఈనాడు’ ప్రత్యేక పరిశీలన చేయగా అనేక విషయాలు వెలుగు చూశాయి. పాసుపుస్తకంలో సగం భూమి నమోదుకాలేదు మొర్రో అంటూ తిరుగుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాక కలెక్టరేట్కు వస్తే తిరిగి తహసీల్దారుకే ఆ దస్త్రాన్ని పంపుతున్నారు. తహసీల్ కార్యాలయం- కలెక్టరేట్ల మధ్య అర్జీలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కొక్కరూ పదుల సార్లు తిరిగిపోతున్నారు. బాధితులు పత్రాల జిరాక్స్ తీయడానికే రూ.వందలు ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సమస్యలన్నీ 2017లో నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం ఫలితంగా ఉత్పన్నమైనవే. నాడు సిబ్బంది చేసిన తప్పులు, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం ఇప్పుడు లక్షల మందికి శాపంగా మారింది. యజమానులకు తెలియకుండానే పాసుపుస్తకంలో భూ విస్తీర్ణాలను తగ్గించడం, కొందరికి పెంచడం(ఆర్ఎస్సార్).. కొందరు పట్టాదారులకు అసలు పాసుపుస్తకాలే జారీ చేయకపోవడం.. కొనుగోలు చేసినా పాత యజమాని పేరుతోనే దస్త్రాలు ఉండటం లాంటి ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. దస్త్రాల ప్రక్షాళన చేపట్టి ఐదేళ్లు పూర్తయినా హక్కుల కల్పనకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదు. అసైన్డ్, లావూణీ, ఇనాం భూములకు పాసుపుస్తకాలు చాలాచోట్ల మంజూరు చేయలేదు. బాధితులు ఎవరిని సంప్రదించాలనే దానిపైనా స్పష్టత లేకపోవడం గమనార్హం.
యాదాద్రి, జనగామ జిల్లాల్లో దయనీయం
* యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజావాణి అర్జీల్లో ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించినవే. వ్యాపారి వద్ద ఒప్పందంతో అప్పు తీసుకున్నామని, తమ వద్ద కొత్త పాసుపుస్తకం ఉండగానే ధరణిలో మరొకరి పేరుపైకి భూమిని మార్చారని... న్యాయం చేయాలని వలిగొండ మండలం వెలువర్తికి చెందిన యాదమ్మ కుమారులు ఫిర్యాదు చేశారు. పైగా వారసత్వ బదిలీ కింద మరో మార్పిడి చోటుచేసుకుందని ఫిర్యాదు చేశారు.
* తమ సగం భూమి పాసుపుస్తకంలో రాలేదని.. బొమ్మలరామారం మండలం యావాపూర్నకు చెందిన వెంకటస్వామి గోడు వెళ్లబోసుకున్నారు.
* హక్కులు కల్పించాలని, పట్టాలు జారీ చేయాలని సంస్థాన్ నారాయణపూర్, ఆలేరు తదితర చోట్ల నుంచి రైతులు కలెక్టరేట్కు వచ్చారు.
* తనకున్న మూడెకరాల్లో ఎకరం మాత్రమే పాసుపుస్తకంలో వచ్చిందని జనగామ జిల్లా ప్రజావాణిలో నర్మెట్టకు చెందిన పెంటమ్మ ఫిర్యాదు చేశారు.
* దేవాదుల కాల్వలో 28 గుంటలు పోగా మిగిలిన 3.12 గుంటల భూమిని నమోదు చేయాలంటూ రఘునాథపాలెం మండలం ఖిలాషాపురానికి చెందిన యాదగిరి అర్జీ ఇచ్చారు.
* మాజీ సిపాయి కేటగిరిలో శంకర్రెడ్డికి ప్రభుత్వం భువనగిరిలో నాలుగు ఎకరాలు ఇచ్చింది. ధరణిలో మాత్రం భూమి కేటగిరి వద్ద జనరల్గా పేర్కొనాల్సి ఉండగా సీలింగ్ అని నమోదు చేశారు. అంతే, ‘22ఎ’లో పడిపోయింది. దీంతో ఆయన ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఎన్నిసార్లు తిరిగినా సమస్య తీర్చడం లేదని వాపోతున్నారు.
సత్తెమ్మకు ఎంత కష్టం..
తన భూమికి పట్టా ఎందుకు ఇవ్వడం లేదంటూ భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి వేదికపై ఉన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డిని అడుగుతున్న 70 ఏళ్ల ఈ బామ్మ పేరు సత్తెమ్మ. ఆమె ఇచ్చిన కాగితం చూసిన అధికారి తహసీల్దారును సంప్రదించాలంటూ రాసిచ్చారు. ‘నాలుగోసారి ఇక్కడికి వచ్చిన. నెలకు రూ.1200 మందులకే అవుతున్నాయి. ఇక్కడికి వచ్చిపోవడానికి రూ.370 కావాలి. నా బాధ ఎవరికీ పట్టదా?’ అంటూ ఆ పెద్దావిడ ఆయన ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యేమిటంటే యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులోని 349/ఉ సర్వే నంబరులో 11 గుంటల భూమి ఆమె పేరుతో ఉంది. ధరణి రికార్డుల్లో ఆధార్ ఇన్కరెక్ట్, నాట్ సైన్డ్ అని చూపుతోంది. గతేడాది జులై, సెప్టెంబరులలో రెండుసార్లు మీసేవ ద్వారా దరఖాస్తు చేసినా సమస్య తీరలేదు.
న్యాయానికిపోతే అన్యాయమైంది!
అరవై ఆరేళ్ల ఈ రైతు పేరు కల్లపల్లి మడెప్ప. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణికి ఇప్పటికే 15 సార్లు వచ్చారు. సొంతూరు మునిపల్లి మండలం కంకోల్. ఆయనకు మూడు సర్వే నంబర్లలో 4.30 ఎకరాల భూమి ఉండగా ఇతరులకు చెందిన 1.06 ఎకరాలు అదనంగా చేర్చి పాసుపుస్తకం ఇచ్చారు. అదనంగా వచ్చిన భూమిని తొలగించడానికి అభ్యంతరమేదీ లేదంటూ నిజాయతీగా 2018లో ఆయన బాండ్పేపర్ రాసిచ్చారు. అదే తప్పయింది. 2021లో రెవెన్యూ అధికారులు ఏకంగా ఆయన భూమిని కూడా తొలగించి ఇతరుల పేర్లపైకి మార్చారు. ‘ఇదేంది సారూ! న్యాయానికి పోతే అన్యాయం చేశారంటూ తహసీల్దారు కార్యాలయానికి 30 సార్లు తిరిగినా ఫలితం లేకపోయింది’ అని మడెప్ప వాపోయారు.
నా భూమిని తొలగించారు..
ప్రైవేటు ఉపాధ్యాయుడైన దినేశ్రెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లె. తన తండ్రి భాస్కర్రెడ్డి గిఫ్ట్డీడ్ కింద నాలుగు ఎకరాలు ఇవ్వగా 2010లో రిజిస్ట్రేషన్ చేసుకుని పాసుపుస్తకం పొందారు. 2019లో తన పహాణీ కాపీని పరిశీలించుకోగా 1.36 ఎకరాలు వేరే వ్యక్తులకు కేటాయించినట్లు గుర్తించారు. ‘‘నా అనుమతి లేకుండానే భూమిని తొలగించారు. సరిచేయాలని నాలుగేళ్లుగా తిరుగుతున్నా. ప్రజావాణికి రావడం ఇది మూడోసారి’’ అంటూ ఆయన నిట్టూర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.