స్వయం ఉపాధికి చేయూత కరవు
రాష్ట్రంలో బలహీనవర్గాలు, వెనుకబడిన తరగతుల యువత స్వయం ఉపాధికి ప్రభుత్వ ఆసరా కరవైంది. సంక్షేమ కార్పొరేషన్లకు దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా, రాయితీ రుణాలు మంజూరు కావడం లేదు. కరోనా తదితర
మంజూరు కాని రాయితీ రుణాలు
9 లక్షల మంది ఎదురుచూపులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో బలహీనవర్గాలు, వెనుకబడిన తరగతుల యువత స్వయం ఉపాధికి ప్రభుత్వ ఆసరా కరవైంది. సంక్షేమ కార్పొరేషన్లకు దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా, రాయితీ రుణాలు మంజూరు కావడం లేదు. కరోనా తదితర కారణాలతో గత మూడేళ్లుగా ఆయా కార్పొరేషన్లు రుణాల కార్యాచరణ సిద్ధం చేయకపోవడంతో.. కుట్టుమిషను, జిరాక్సు కేంద్రం, కిరాణా దుకాణం, ఆటోరిక్షా వంటి వాటితో స్వయం ఉపాధి పొందాలనుకున్న నిరుద్యోగుల ఆశలు నెరవేరడం లేదు. చివరకు తోపుడుబండి వ్యాపారానికి రూ.50 వేల సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా వేలల్లో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన తొమ్మిది లక్షలకు పైగా నిరుద్యోగ యువకులు రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల పరిధిలో నాలుగేళ్ల క్రితం చేసిన దరఖాస్తులు మనుగడలో ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల్లో మూడేళ్ల కిందట తీసుకున్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.
సంక్షేమశాఖల వారీగా ఇదీ పరిస్థితి..
దళితబంధు పథకం వచ్చాక.. ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరులో కదలిక లేదు. వీటి కోసం ఏటా 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారు. 2017-18లో ఎంపికైన దరఖాస్తుదారులకు మంజూరైన రుణాలు రూ.80 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. 2018 నుంచి 2020 వరకు కార్యాచరణ అమలు చేయలేదు. 2020-21లో 1.73 లక్షల మంది దరఖాస్తు చేసినా, లక్ష్యం మేరకు 18,285 మందికి మాత్రమే రుణాలివ్వాలని ఎస్సీ కార్పొరేషన్ నిర్ణయించింది. వాటికి కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది.
* గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్) పరిధిలో 2017-18 ఏడాదికి సంబంధించి పెండింగ్ రుణాలు ఇటీవల విడుదల చేశారు. ఆ తరువాత వరుసగా రెండేళ్లకు ప్రణాళిక రూపొందించలేదు. 2020-21, 2021-22లలో స్వయం ఉపాధి కోసం రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 27 వేల మందికి మాత్రమే ఉపాధి పథకాలు మంజూరయ్యాయి. వీటికి రూ.280 కోట్లు అవసరమని గిరిజన కార్పొరేషన్ అంచనా వేసినా నిధులు విడుదల కాలేదు.
* బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు, సహకార సమాఖ్యల పరిధిలో 2017-18కి సంబంధించి 5.70 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో రూ.లక్ష లోపు రుణాల కోసం దరఖాస్తు చేసిన 60 వేల మందికి నూరు శాతం సబ్సిడీ ఇస్తూ.. రూ.50 వేల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్ణయించింది. వారిలో 30 వేల మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేసింది. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల పరిధిలో రూ.లక్షకు పైగా రుణాల కోసం దరఖాస్తు చేసిన దాదాపు 5 లక్షల మంది దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.
* మైనార్టీ కార్పొరేషన్ పరిధిలో 2018-19లో తీసుకున్న 23,829 దరఖాస్తుల పరిష్కారం పూర్తికాలేదు. కొత్త దరఖాస్తులు స్వీకరించడంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు