
Telangana News: తల్లి మరణం ఒకవైపు.. ‘పరీక్ష’ మరోవైపు..
దుఃఖంలోనూ ‘పది’ పరీక్ష రాసిన ఇద్దరు విద్యార్థులు
చిగురుమామిడి, గంగాధర, న్యూస్టుడే: ఇంటి వద్ద తల్లి మృతదేహం.. గుండెల నిండా కొండంత దుఃఖం.. మరోవైపు అనివార్యంగా పరీక్ష రాయాల్సిన పరిస్థితి. వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు పదో తరగతి విద్యార్థులకు ఎదురైన విషాదఘట్టాలివి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన వంగ శ్రీనివాస్, శ్రీలతల పెద్ద కుమారుడు రాహుల్ పదో తరగతి చదువుతున్నాడు. ఆర్థిక సమస్యల నేపథ్యంలో శ్రీలత బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహం ఇంటి వద్ద ఉండగానే.. తప్పనిసరై రాహుల్ వెళ్లి ఆంగ్లం పరీక్ష రాసి వచ్చాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన గుడి నిఖిల్రెడ్డి కరీంనగర్ జిల్లా గంగాధరలో పదో తరగతి చదువుతున్నాడు. ఆయన తల్లి మమత అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. అప్పటికే పరీక్ష రాసి తల్లి అంత్యక్రియలకు హాజరైన నిఖిల్రెడ్డి.. బుధవారం ఆంగ్లం పరీక్షకు హాజరయ్యాడు.
వడదెబ్బతో విద్యార్థి మృతి!
సంగారెడ్డి గ్రామీణం, న్యూస్టుడే: పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థి మార్గమధ్యలో నీరు తాగి హఠాన్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ఖాన్పేట్కు చెందిన ఎం.శ్రీనివాస్(17) అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. బుధవారం సంగారెడ్డిలో పదో తరగతి పరీక్ష రాశాడు. తరవాత మిత్రులతో కలిసి ఇంటికి వెళ్తుండగా దాహమేస్తోందని మార్గమధ్యలోని దుకాణంలో నీరు కొనుక్కొని తాగాడు. క్షణాల్లోనే మృత్యువాతపడ్డాడు. స్థానికులు ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్టు తెలిపారు. ఎండలో వెంటనే నీరు తాగడం, వడదెబ్బ కారణాలతో శ్రీనివాస్ మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్బాబు
-
Politics News
BJP: తొలిరోజు రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై చర్చించిన భాజపా జాతీయ కార్యవర్గం
-
General News
TS corona: తెలంగాణలో 500 దాటిన కరోనా కేసులు
-
General News
Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Ship: రెండు ముక్కలైన నౌక.. 24 మందికిపైగా సిబ్బంది గల్లంతు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Acharya: ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు.. రామ్చరణ్ ఆ రోల్ చేయకపోతే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ