Telangana News: తల్లి మరణం ఒకవైపు.. ‘పరీక్ష’ మరోవైపు..
ఇంటి వద్ద తల్లి మృతదేహం.. గుండెల నిండా కొండంత దుఃఖం.. మరోవైపు అనివార్యంగా పరీక్ష రాయాల్సిన పరిస్థితి. వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు పదో తరగతి విద్యార్థులకు ఎదురైన విషాదఘట్టాలివి.
దుఃఖంలోనూ ‘పది’ పరీక్ష రాసిన ఇద్దరు విద్యార్థులు
చిగురుమామిడి, గంగాధర, న్యూస్టుడే: ఇంటి వద్ద తల్లి మృతదేహం.. గుండెల నిండా కొండంత దుఃఖం.. మరోవైపు అనివార్యంగా పరీక్ష రాయాల్సిన పరిస్థితి. వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు పదో తరగతి విద్యార్థులకు ఎదురైన విషాదఘట్టాలివి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన వంగ శ్రీనివాస్, శ్రీలతల పెద్ద కుమారుడు రాహుల్ పదో తరగతి చదువుతున్నాడు. ఆర్థిక సమస్యల నేపథ్యంలో శ్రీలత బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహం ఇంటి వద్ద ఉండగానే.. తప్పనిసరై రాహుల్ వెళ్లి ఆంగ్లం పరీక్ష రాసి వచ్చాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన గుడి నిఖిల్రెడ్డి కరీంనగర్ జిల్లా గంగాధరలో పదో తరగతి చదువుతున్నాడు. ఆయన తల్లి మమత అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. అప్పటికే పరీక్ష రాసి తల్లి అంత్యక్రియలకు హాజరైన నిఖిల్రెడ్డి.. బుధవారం ఆంగ్లం పరీక్షకు హాజరయ్యాడు.
వడదెబ్బతో విద్యార్థి మృతి!
సంగారెడ్డి గ్రామీణం, న్యూస్టుడే: పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థి మార్గమధ్యలో నీరు తాగి హఠాన్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ఖాన్పేట్కు చెందిన ఎం.శ్రీనివాస్(17) అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. బుధవారం సంగారెడ్డిలో పదో తరగతి పరీక్ష రాశాడు. తరవాత మిత్రులతో కలిసి ఇంటికి వెళ్తుండగా దాహమేస్తోందని మార్గమధ్యలోని దుకాణంలో నీరు కొనుక్కొని తాగాడు. క్షణాల్లోనే మృత్యువాతపడ్డాడు. స్థానికులు ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్టు తెలిపారు. ఎండలో వెంటనే నీరు తాగడం, వడదెబ్బ కారణాలతో శ్రీనివాస్ మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్