రాష్ట్రానికి హ్యుందాయ్
మరో మూడు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చాయి. హ్యుందాయ్ రూ.1400 కోట్లతో, జీఎంఎం ఫాడ్యులర్ రూ.50 కోట్లతో, ఈఎంపీఈ రూ.50 కోట్లతో పరిశ్రమల ఏర్పాటు కోసం,
రూ.1400 కోట్లతో భారీ పరిశ్రమ స్థాపనకు ఒప్పందం
మొబిలిటీ క్లస్టర్ వ్యాలీలో పెట్టుబడులు
విస్తరణకు ముందుకొచ్చిన మరో రెండు పరిశ్రమలు
మాస్టర్కార్డ్తో డిజిటల్ సేవలకు అంగీకారం
ఈనాడు, హైదరాబాద్: మరో మూడు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చాయి. హ్యుందాయ్ రూ.1400 కోట్లతో, జీఎంఎం ఫాడ్యులర్ రూ.50 కోట్లతో, ఈఎంపీఈ రూ.50 కోట్లతో పరిశ్రమల ఏర్పాటు కోసం, విఖ్యాత ఆర్థిక సేవల సంస్థ మాస్టర్కార్డ్ రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఆర్థిక సేవల కోసం మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గతిశక్తి సమూహం (మొబిలిటీ క్లస్టర్) వ్యాలీలో రూ.1400 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమను స్థాపించాలని ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ నిర్ణయించింది. దీనిద్వారా రెండువేల మందికి ఉపాధి కల్పించనుంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్లో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్లో హ్యుందాయ్ సీఐవో యంగ్చోచి తమ ప్రతినిధి బృందంతో రాష్ట్ర మంత్రి కేటీ రామారావును కలిశారు. ఈ సందర్భంగా యంగ్చోచి మాట్లాడుతూ.. ‘‘వినూత్న రీతిలో తెలంగాణ మొబిలిటీ క్లస్టర్ వ్యాలీ ఏర్పాటు గొప్ప నిర్ణయం. దీనిలో మేమూ భాగస్వాములుగా చేరతాం. మా సంస్థ పరంగా టెస్ట్ట్రాక్లతో పాటు ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేస్తాం’’ అని తెలిపారు. హ్యుందాయ్ నిర్ణయంపై కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. గతిశక్తి రంగానికి ఈ భారీ పెట్టుబడి గొప్పబలాన్ని, వాహనరంగానికి ఊతమిస్తుంది. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మొబిలిటీ వ్యాలీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. హ్యుందాయ్ రాకతో ఈ రంగంలో తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయి.
మరో రూ.50 కోట్ల పెట్టుబడితో జీఎంఎం ఫాడ్యులర్ విస్తరణ
రసాయన, ఔషధ, ఆహార, విద్యుత్ రంగ సంస్థలకు గ్లాస్లైనింగ్ పరికరాలు, రియాక్టర్, ట్యాంక్, కాలమ్లను తయారు చేసే అంతర్జాతీయ సంస్థ జీఎంఎం ఫాడ్యులర్ హైదరాబాద్లో రూ. 50 కోట్లతో తమ పరిశ్రమను విస్తరించనుంది.ఈ విస్తరణతో మరో 300 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ సంస్థ రెండేళ్ల క్రితం రూ.100 కోట్లతో హైదరాబాద్లో పరిశ్రమను స్థాపించింది. సంస్థ వాణిజ్య విభాగం సీఈవో థామస్ కెహ్ల్, ప్రపంచ ఆర్థిక వేదిక డైరెక్టర్ అశోక్ పటేల్లు గురువారం మంత్రి కేటీఆర్ను కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘తెలంగాణలో ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత కారణంగా ఇక్కడ పరిశ్రమల స్థాపన అత్యంత సానుకూలాంశంగా ఉంది. మా వ్యాపార విస్తరణలో ఈ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ ఔషధనగిరి ప్రాజెక్టులో భాగస్వామిగా చేరతాం’’ అని తెలిపారు. హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించాలనుకున్న జీఎంఎం నిర్ణయం తనకు సంతోషాన్ని కలిగించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఫార్మా పరికరాల తయారీ రంగంలో నెంబర్వన్గా ఎదగాలనుకుంటున్న ఆ సంస్థ లక్ష్యాన్ని చేరడంలో హైదరాబాద్ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందన్న నమ్మకం తమకుందని అన్నారు.
టీబీ నిర్ధారణ కిట్ల కేంద్రాన్ని విస్తరించనున్న ఈఎంపీఈ....
స్వీడన్కుచెందిన ఈఎంపీఈ సంస్థ రూ. 50 కోట్ల పెట్టుబడితో క్షయవ్యాధి నిర్ధారణ కిట్ల తయారీ కేంద్రాన్ని విస్తరించనుంది. ఈ సంస్థ ఇటీవలే రూ.25 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో కేంద్రం ఏర్పాటుచేసింది. సంస్థ సీఈవో పవన్ అసలాపురం తమ ప్రతినిధులతో కేటీఆర్తో దావోస్లో భేటీ అయ్యారు. తాము 5 దేశాల్లో క్లినికల్ పరీక్షలు నిర్వహించిన తరువాత హైదరాబాద్ను ఎంచుకున్నట్టు తెలిపారు. అదనంగా రూ.50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. కేటీఆర్ వారిని అభినందించారు.
వినూత్న ఆవిష్కరణలతోనే దేశపురోగతి
దావోస్లో చర్చాగోష్ఠిలో మంత్రి కేటీఆర్
వినూత్న ఆవిష్కరణలతోనే దేశం పురోగమిస్తుందని, వాటిని పెద్దఎత్తున ప్రోత్సహించాలని, తెలంగాణ మాదిరిగా ఇంటింటా ఆవిష్కరణల సంస్కృతి విస్తరించాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. గురువారం దావోస్లో అంకుర వ్యవస్థాపకులతో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి సాధించడానికి ఆవిష్కరణలు దోహదపడతాయి. ఎదుర్కొంటున్న సవాళ్లను దాటుకొని దేశం వేగంగా ముందుకు పోవాలంటే ఆవిష్కరణలు, మథనం, అమలు మంత్రమే మార్గం. అంకురాలలో 95% విఫలం అయ్యే అవకాశం ఉన్నా, నూతన ఆలోచనలకు ప్రోత్సాహమివ్వాలి. సహకారం అందించాలి. తెలంగాణ ఆవిష్కరణల విభాగం ద్వారా పాఠశాల స్థాయిలో అవగాహన కల్పిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వాలు మారినా కనీసం ఒకటి రెండు దశాబ్దాల పాటు ఆవిష్కరణల విధానం స్థిరంగా ఉండాలి’’ అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణకు మాస్టర్కార్డ్
అమెరికా అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మాస్టర్కార్డ్ తెలంగాణతో జత కట్టింది. డిజిటల్ భాగస్వామ్యంపై మంత్రి కేటీఆర్ సమక్షంలో దావోస్లో జరిగిన ఒప్పందంపై సంస్థ వైస్ఛైర్మన్, వృద్ధి విభాగం అధ్యక్షుడు మైఖేల్ ఫ్రోమ్యాన్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్లు సంతకాలు చేశారు.ఈ ఒప్పందం మైలురాయి అని, దీని ద్వారా ప్రపంచ స్థాయిలో పరిష్కారాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘మాస్టర్కార్డ్తో రాష్ట్రంలోని ప్రజలకు అత్యంత వేగంగా పౌరసేవలు, సంక్షేమ పథకాలు, ఆసరా పింఛన్లను అందించడం, రైతులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఆర్థిక సేవలు, సైబర్ క్రైమ్, డిజిటల్ అక్షరాస్యత వంటి కీలక రంగాల్లో కలిసి పనిచేస్తాం’’ అని మంత్రి తెలిపారు. ఫ్రోమ్యాన్ మాట్లాడుతూ, ‘‘డిజిటల్, ఆర్థిక సేవలను విస్తరించడానికి మాస్టర్ కార్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. తెలంగాణ ప్రజలకు డిజిటల్ సేవలను సత్వరమే అందించేందుకు మాస్టర్కార్డు సిద్ధంగా ఉంది.’’ అని తెలిపారు. ఈ సమావేశాల్లో జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..