తెలంగాణలో భాజపాకు అధికారం ఖాయం
తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం యువత బలిదానాలు చేశారని.. ఒక కుటుంబ పాలన కారణంగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, పాలన అవినీతిమయంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి అవి అతిపెద్ద శత్రువులని,
రాష్ట్రంలో అవినీతి పాలన
అమరుల ఆశయాలు నెరవేరట్లేదు
కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి శత్రువులు
బేగంపేట సభలో ప్రధానమంత్రి మోదీ
కేంద్ర పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నారని ధ్వజం
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం యువత బలిదానాలు చేశారని.. ఒక కుటుంబ పాలన కారణంగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, పాలన అవినీతిమయంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి అవి అతిపెద్ద శత్రువులని, వాటిని పారదోలితేనే అభివృద్ధి ద్వారాలు తెరుచుకుంటాయని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇక్కడ భాజపా అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బేగంపేట విమానాశ్రయ ఆవరణలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై, తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఉన్నత శిఖరాలవైపు తీసుకెళ్లడానికి భాజపా ఎంతవరకైనా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ‘తెలంగాణ ఉద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఇక్కడ భాజపా కార్యకర్తలు ఎన్నో సవాళ్లు, వేధింపులు, దాడుల్ని ఎదుర్కొంటూ పోరాడుతున్నారు. ఇక్కడ పోరాటం అధికారం కోసం కాదు. యువతను భాగస్వామ్యం చేస్తూ రాష్ట్రాభివృద్ధిని సాధించడం లక్ష్యం’ అన్నారు.
అవినీతిమయం చేశారు
కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ అయ్యింది. ఇక్కడి ప్రభుత్వం సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తోంది. పాలనను అవినీతిమయం చేశారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. కుటుంబ పార్టీలు తమ సొంత ఖజానాను నింపుకోవడంపైనే దృష్టి పెడతాయి. రాష్ట్రంలో భాజపా చేస్తున్న సంఘర్షణ రోజురోజుకు రాటుదేలుతోంది. ఇక్కడ 2023లో భాజపా అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టమవుతోంది. తెలంగాణకు పురోగామి, నిజాయితీ గల ప్రభుత్వం అవసరం. అలాంటి ప్రభుత్వాన్ని భాజపా మాత్రమే ఇవ్వగలుగుతుంది. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి రాజకీయాలు చేస్తోంది.
అభివృద్ధికి అడ్డంకిగా మూఢ విశ్వాసాలు
మూఢనమ్మకాలు తెలంగాణ అభివృద్ధికి అడ్డంకి. గుజరాత్లో నేను సీఎంగా ఉన్నప్పుడు కొన్ని నగరాలకు వెళితే అధికారం పోతుందన్న ప్రచారం ఉండేది. నేను ఆ ప్రదేశాలకు పదేపదే వెళ్లి వచ్చాను. యూపీలో ఒకచోటుకు వెళితే ఓడిపోతావని సీఎం యోగి ఆదిత్యనాథ్కు కొందరు చెబితే ఆయన పట్టించుకోకుండా అక్కడికే వెళ్లి గెలిచారు. రాష్ట్రంలో భాజపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులు నా దృష్టికి వచ్చాయి. పార్టీ కోసం ముగ్గురు కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు.
తెలుగులో ప్రసంగం ప్రారంభం
దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ‘పట్టుదల, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మధ్యాహ్నం 1.04 గంటల నుంచి 1.30 వరకు ప్రధాని ప్రసంగించారు. వేదికపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, పార్టీ నేతలు మురళీధర్రావు, లక్ష్మణ్, సోయం బాపురావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్రావు, గరికపాటి మోహన్రావు, జితేందర్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ప్రదీప్కుమార్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్గౌడ్ ఉన్నారు.
ఎక్కడా తగ్గొద్దు.. జెండా పాతాలి!
‘2013లో నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో పాల్గొన్న సభను మరిచిపోలేను. అప్పట్లో సభకు టికెట్ కొని మీ ప్రేమ వర్షాన్ని నాపై కురిపించారు. అదో కొత్త చరిత్ర. ఇదే హైదరాబాద్.. ఇదే తెలంగాణ నాకు టర్నింగ్ పాయింట్. మీరు ఇప్పుడు కొత్త చరిత్రను సృష్టించాలి. తెలంగాణలో భాజపా జెండా పాతాలి. ఏ మాత్రం తగ్గొద్దు. మీ వెన్నంటి ఉంటాం.
- పార్టీ శ్రేణులతో మోదీ
కుటుంబ పాలనను పెకలిస్తాం: ఎంపీ సోయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కుటుంబ, వారసత్వ పాలనను కూకటివేళ్లతో పెకిలించే సత్తా భాజపాకు ఉందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. వెయ్యిమంది కేసీఆర్లు వచ్చినా భాజపాను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!