సైబర్ నేరాల వెల్లువ
రాష్ట్రంలో నేరాల తీరు మారిపోతోంది. సంప్రదాయ నేరాలను సాంకేతిక నేరాలు అధిగమిస్తున్నాయి. దొంగతనాలు, దోపిడీల వంటి వాటితో పోల్చుకుంటే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా నేరాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి.
రాష్ట్రంలో రోజుకు దాదాపు 150 ఫిర్యాదులు
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలో నేరాల తీరు మారిపోతోంది. సంప్రదాయ నేరాలను సాంకేతిక నేరాలు అధిగమిస్తున్నాయి. దొంగతనాలు, దోపిడీల వంటి వాటితో పోల్చుకుంటే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా నేరాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. మారుమూల పోలీస్స్టేషన్ల వద్ద కూడా సైబర్ బాధితులు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం సగటున రాష్ట్రంలో రోజుకు కనీసం సైబర్ నేరాలకు సంబంధించి 150 ఫిర్యాదులు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో గత ఏడాది 17,326 చోరీలు, దోపిడీ కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 47 కేసులు.. ఇదే సమయంలో నమోదైన సైబర్ నేరాల సంఖ్య 8839. అంటే రోజుకు 24 కేసులు నమోదయ్యాయన్నమాట. కానీ పరిస్థితి మారుతోంది. రోజుకు 150 వరకూ సైబర్ ఫిర్యాదులు వస్తున్నాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనే కనీసం 100 వరకూ ఫిర్యాదులు ఉంటున్నాయన్నారు. సైబర్ నేరాల విషయంలో అసలు బాధితులకే నేరం ఎలా జరిగిందో స్పష్టత ఉండదు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వ్యాలెట్ ద్వారా తన సోదరుడికి రూ.25 వేలు బదిలీ చేయగా సాంకేతిక కారణాల వల్ల లావాదేవీ పూర్తికాలేదు. తన డబ్బు పోయిందన్న కంగారులో ఆ వ్యక్తి గూగుల్లో సదరు వ్యాలెట్ సంస్థ కాల్సెంటర్ నంబరు తీసుకొని ఫిర్యాదు చేశాడు. కాల్సెంటర్ కేటుగాడు బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి మిగిలిన డబ్బు కూడా కొల్లగొట్టాడు. గూగుల్లో వ్యాలెట్ సంస్థ కాల్సెంటర్ పేరుతో సైబర్ నేరానికి పాల్పడ్డారు. కానీ ఇదెలా జరిగిందో బాధితుడికి అర్థం కాలేదు. వివరాలన్నీ తానే నేరస్థుడికి చెప్పాడు కాబట్టి బ్యాంకుకు సంబంధం లేదు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకొని పక్కనపెట్టారు. ప్రస్తుత ఫిర్యాదుల్లో మూడొంతులు ఇలానే ఉంటున్నాయి.
దర్యాప్తు తిప్పలు
సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాబట్టడం కష్టం. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి నేరగాడు ఖాతాలు కొల్లగొడతాడు. హైదరాబాద్ వంటి నగరాల్లోని పోలీసులకు ఇలాంటి నేరాల తీరు, దర్యాప్తుపై పట్టు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి అంతగా అవగాహన లేదు. కానీ మామూలు నేరాల కంటే సైబర్ నేరాలు పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా దర్యాప్తు జరగకపోవడంతో బాధితులకు న్యాయం జరగడంలేదు. గ్రామీణ పోలీసులకు సైబర్ నేరాల్లో శిక్షణ ఇస్తున్నా.. అది సరిపోవడంలేదు. సైబర్ నేరాల దర్యాప్తుపై సిబ్బందికి ఎక్కువ అవగాహన కల్పించాలి. వచ్చిన ప్రతి ఫిర్యాదుపైనా దర్యాప్తు జరిపేలా చూడాలి. లేకపోతే వీటి సంఖ్య పెరిగి అదుపు చేయలేని స్థితికి చేరుకునే ప్రమాదముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా