విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తెలంగాణ
విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 2014 జూన్ 2 నుంచి 2022 ఏప్రిల్ 1 వరకు 7,778 నుంచి 17,305 మెగావాట్లకు పెరిగిందని పేర్కొంది.
స్థాపిత సామర్థ్యం 7,778 నుంచి 17,305 మెగావాట్లకు పెంపు
తలసరి కరెంటు వినియోగంలో దేశంలో అగ్రస్థానం: ప్రభుత్వం వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 2014 జూన్ 2 నుంచి 2022 ఏప్రిల్ 1 వరకు 7,778 నుంచి 17,305 మెగావాట్లకు పెరిగిందని పేర్కొంది. ప్రజలకు నాణ్యమైన కరెంటును 24 గంటలూ అందిస్తున్న ఏకైక రాష్ట్రమని తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి విద్యుత్తు రంగంలో సాధించిన ప్రగతిని ప్రకటనలో వివరించింది. తలసరి కరెంటు వినియోగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొంది. ‘‘రాష్ట్రం ఏర్పడిన తరవాత కొత్తగూడెం జిల్లా బయ్యారంలో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి విద్యుత్కేంద్రాన్ని, నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి విద్యుత్కేంద్రాన్ని నిర్మిస్తున్నాం. భద్రాద్రి ఇప్పటికే పూర్తయి కరెంటు ఉత్పత్తి జరుగుతోంది. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 23,667 మంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి ఆర్టిజన్ పేరుతో నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ఉచిత సరఫరాకు రూ.39,200 కోట్ల రాయితీ
మొత్తం విద్యుత్తులో 40 శాతం వ్యవసాయానికే వినియోగిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడ్డాక రూ.3,196 కోట్ల వ్యయంతో 6.39 లక్షల వ్యవసాయ కనెక్షన్లను ఇచ్చాం. ఏడున్నరేళ్లలో ఉచిత సరఫరాకు రూ.39,200 కోట్లను రాయితీగా విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లకు అందజేశాం. నాయీబ్రాహ్మణులు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు 250 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు ఇస్తున్నాం. 10 వేల పవర్ చేనేత యూనిట్లకు కరెంటు ఛార్జీల్లో 50 శాతం రాయితీ కింద రూ.34.50 కోట్లు చెల్లించాం. విద్యుత్తు సబ్స్టేషన్లు, లైన్లు, పంపిణీ సామర్థ్యం పెంచడానికి రూ.35వేల కోట్లకు పైగా ఖర్చుచేశాం. ఈ సొమ్మును కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ‘విద్యుత్తు ఆర్థికసంస్థ’(పీఎఫ్సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్ఈసీ)ల నుంచి 12 శాతం వడ్డీకి తీసుకున్నాం. వ్యక్తిగత రుణాలపై బ్యాంకుల వడ్డీకన్నా ఇది ఎక్కువ. అంతర్రాష్ట్ర కరెంటు సరఫరా కోసం పవర్గ్రిడ్ సంస్థకు రూ.1,580 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. కరోనా సమయంలోనూ విద్యుత్తు ఉద్యోగులు ప్రాణాలను పణంగాపెట్టి పనిచేశారు.భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెరగకుండా అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుని లాభాల్లో పయనించాల్సిన బాధ్యత విద్యుత్తు సంస్థల ఉద్యోగులపై ఉంది’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. నష్టాలను తగ్గించుకుని లాభాలిచ్చే వాణిజ్య, పారిశ్రామిక కరెంటు అమ్మకాల పెంపు ద్వారా విద్యుత్తు సంస్థల స్థితిని మెరుగుపరుచుకోవడానికి అవకాశాలున్నాయని సూచించింది. ఈ ఏడాది(2022-23)లో కరెంటు ఛార్జీలను 18శాతం పెంచడానికి రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి అనుమతించింది. ఛార్జీల పెంపు ద్వారా రూ.6,831 కోట్లు రాబట్టాలని డిస్కంలు ప్రతిపాదించగా రూ.5,596 కోట్ల వరకూ పెంపునకు అనుమతించినట్లు సర్కారు చెప్పింది. 2014-15లో టన్ను బొగ్గు వినియోగంపై క్లీన్ఎనర్జీ రుసుం రూ.50 ఉండగా ఇప్పుడు రూ.400కి పెరిగిందని... చమురు, గ్యాస్, బొగ్గు, రవాణా ధరల పెంపు వల్ల విద్యుదుత్పత్తి వ్యయం అధికమైనట్లు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’