రాష్ట్రానికి రూ.4,200 కోట్ల పెట్టుబడులు
పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన శుక్రవారం ముగిసింది. దీని ద్వారా రూ.4200 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించినట్లు ఆయన ట్విటర్లో వెల్లడించారు. 45 ప్రసిద్ధ సంస్థలతో ఆయన సమావేశమయ్యారు.
కేటీఆర్ విదేశీ పర్యటనలో కుదిరిన ఒప్పందాలు
45 కంపెనీలతో భేటీ
చివరి రోజు మంత్రిని కలిసిన జడ్ఎఫ్ ప్రతినిధులు
ఈనాడు, హైదరాబాద్: పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన శుక్రవారం ముగిసింది. దీని ద్వారా రూ.4200 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించినట్లు ఆయన ట్విటర్లో వెల్లడించారు. 45 ప్రసిద్ధ సంస్థలతో ఆయన సమావేశమయ్యారు. కేటీఆర్ చొరవతో దావోస్లో తొలిసారిగా ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్తో పాటు పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు దానిని సందర్శించి కేటీఆర్తో భేటీ అయ్యారు.కొన్ని సంస్థలు పెట్టుబడులు ప్రకటించగా.. మరికొన్ని విస్తరణ ప్రణాళికలను వెల్లడించాయి. ఇంకొన్ని పరస్పర సహకారానికి అంగీకరించాయి. కేటీఆర్ ఈనెల 17న ఆయన విదేశాలకు పయనమయ్యారు. మొదట లండన్ వెళ్లారు. బ్రిటన్-భారత్ వాణిజ్య మండలి ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.పలు ప్రతిష్ఠాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. తర్వాత స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యారు. వివిధ దేశాల ప్రతినిధులతో, కంపెనీల అధిపతులతో, ఇతర ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, అనుకూలతలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తమ విదేశీ పర్యటన విజయవంతమైందని శుక్రవారం ట్విటర్లో కేటీఆర్ తెలిపారు. ప్రపంచ వేదికపై ప్రభుత్వ విధానాలు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని అన్నారు. దీని ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, యూకే, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ప్రవాసులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్లో జెడ్ఎఫ్ విస్తరణ
జర్మనీకి చెందిన ప్రసిద్ధ వాహనాల విడిభాగాల తయారీ సంస్థ జెడ్ఎఫ్ హైదరాబాద్లోని తమ కార్యాలయాన్ని ప్రపంచంలో అతిపెద్ద సౌకర్యాల కేంద్రం (ఫెసిలిటీ సెంటర్)గా విస్తరిస్తోంది.తమ సంస్థకు ప్రపంచంలో 100 దేశాలు, 18 ప్రధాన అభివృద్ధి కేంద్రాల్లో కార్యాలయాలుండగా... వాటన్నింటికంటే హైదరాబాద్ సౌకర్యాల కేంద్రం పెద్దదని జెడ్ఎఫ్ పేర్కొంది. తాజా విస్తరణ ద్వారా మూడు వేలమందికి అదనంగా ఇది ఉపాధిని కల్పించనుంది. జెడ్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ డిర్క్ ఆడమ్సి జిక్, ఇతర ప్రతినిధులు శుక్రవారం దావోస్లో మంత్రి కేటీఆర్ను కలిసి తమ విస్తరణ ప్రణాళికను వివరించారు. తెలంగాణ ప్రభుత్వ మొబిలిటీ క్లస్టర్లో భాగంగా నానక్రాంగూడలో భారీ గతిశక్తి (మొబిలిటీ) కేంద్రాన్ని జూన్ 1న ప్రారంభిస్తున్నామని తెలిపారు. దీనికి హాజరు కావాలని కేటీఆర్ను వారు ఆహ్వానించారు. జెడ్ఎఫ్ విస్తరణపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. దీని ద్వారా తెలంగాణలో గతిశక్తి రంగానికి అదనపు బలం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దావోస్ తనకు ఎంతో ఇష్టమైన వేదిక అని, ఉత్తమ విధాన రూపకర్తలు, వ్యాపారవేత్తలు, దార్శనిక నాయకులకు అనుసంధానంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా దావోస్ తీర్చిదిద్దుతోందని, అక్కడ పాల్గొనడం గొప్ప అవకాశమని తెలిపారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ నేతృత్వంలోని తమ బృందం చక్కగా చనిచేసిందని తెలిపారు.
జ్యురిక్ చేరుకున్న కేటీఆర్
దావోస్ పర్యటనను ముగించుకొని శుక్రవారం కేటీఆర్ స్విట్జర్లాండ్ రాజధాని జ్యురిక్ చేరుకున్నారు. అక్కడో వీధిలో భోజనం సందర్భంగా దిగిన ఫొటోను ఆయన ట్విటర్లో పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు