తెలుగు రాష్ట్రాల గవర్నర్ల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను శుక్రవారం తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ భేటీ జరిగింది.

Published : 28 May 2022 06:08 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను శుక్రవారం తెలంగాణ గవర్నర్‌ తమిళిసై మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ భేటీ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు అనేక అంశాలపై చర్చించుకున్నారు. బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు భువనేశ్వర్‌లో తితిదే కొత్తగా నిర్మించిన శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరై, తిరిగి విజయవాడ వెళ్తూ హైదరాబాద్‌ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా తమిళిసై కలిసి మాట్లాడారు. గవర్నర్‌ దంపతులను శాలువాతో సత్కరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని