న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు రూ.6 కోట్లు

తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు రూ.6 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. న్యాయవాదుల ఆరోగ్య బీమా, రోడ్డు ప్రమాద బీమా ప్రీమియాల....

Published : 28 May 2022 06:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌కు రూ.6 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. న్యాయవాదుల ఆరోగ్య బీమా, రోడ్డు ప్రమాద బీమా ప్రీమియాల చెల్లింపుల నిమిత్తం ఈ మొత్తాన్ని విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఎన్‌.నర్సింగ్‌రావు జీవో జారీ చేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం నిధులు మంజూరు చేసినందుకు హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి సీహెచ్‌.కల్యాణ్‌రావు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు