లెక్కకు మిక్కిలి.. హక్కుల చిక్కులు!
భూ పరిపాలన బాధ్యతలను రెవెన్యూ శాఖ క్రమంగా పక్కనపెడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హక్కుల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను తీర్చడంలో ఆ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వాపోతున్నారు.
ఆన్లైన్ ఫిర్యాదులకు స్పందన కరవు
నేరుగా మొర వినిపించే ఏర్పాటేదీ?
అంతంత మాత్రంగానే ధరణి సహాయ కేంద్రాలు..
ఈనాడు, హైదరాబాద్: భూ పరిపాలన బాధ్యతలను రెవెన్యూ శాఖ క్రమంగా పక్కనపెడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హక్కుల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను తీర్చడంలో ఆ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వాపోతున్నారు. అన్ని రాష్ట్రాల్లో భూ పరిపాలనను రెవెన్యూ శాఖే నిర్వహిస్తూ హక్కులు కల్పిస్తోంది. రాష్ట్రంలోనూ 2020 అక్టోబరు 29 వరకు సజావుగానే సాగింది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాకే పరిస్థితి మారిపోయింది. పోర్టల్ శాఖ పరిధిలోనే ఉన్నప్పటికీ ఆన్లైన్లో భూ దస్త్రాల సమాచారం ఉన్న ఖాతాదారుల లావాదేవీలనే నిర్వహిస్తున్నారు. ధరణి బయట ఉన్న వారు, పోర్టల్లో నమోదైనా వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నవారిని రెండేళ్లుగా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
రాష్ట్రంలో 1936లో చేపట్టిన క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా ఏర్పాటు చేసిన సర్వే నంబర్లు, హద్దుల సమాచారం ప్రాతిపదికనే ఇప్పటికీ దస్త్రాల నిర్వహణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సమగ్ర సర్వేకు సన్నద్ధమైనప్పటికీ కార్యాచరణ చేపట్టలేదు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ దస్త్రాల పరిశీలనకు 2017 చివర్లో ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం దస్త్రాలను డిజిటలీకరించారు. 71 లక్షల ఖాతాలు ఉంటే 61.30 లక్షల ఖాతాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి పోర్టల్ పరిధికి తెచ్చారు. మరో మూడున్నర లక్షల మంది రైతులకు సంబంధించిన ఖాతాలు ఆన్లైన్ కాలేదు. ఇలాంటి వారి సమాచారాన్ని పోర్టల్లో చేర్చేందుకు మాడ్యూళ్లు, ఐచ్ఛికాలు లేవని తహసీల్దార్లు, జిల్లా అధికారులు చెబుతున్నారు. కొందరు బాధితులు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేస్తున్నా.. పట్టించుకున్నవారే లేరు. మరోవైపు సహాయ కేంద్రాల ఏర్పాటూ అంతంతమాత్రంగానే ఉంది.
ఉపసంఘం సూచించినా..
2020 అక్టోబరుకు ముందు యాజమాన్య హక్కులు కల్పించే అధికారం తహసీల్దార్లకు ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి లేకపోవడంతో బాధితులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ అయోమయాన్ని దూరం చేసేందుకు మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ధరణి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కొన్ని జిల్లా కేంద్రాల్లో అవి ఏర్పాయ్యాయి. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో సిబ్బంది సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు వారాలు సహాయ కేంద్రాలు నడిపించి.. మమ అనిపించారు. దీంతో తిరిగి ప్రజావాణి కార్యక్రమంపై బాధితులు ఆధారపడుతున్నారు. పూర్తిస్థాయిలో భూ సమస్యలు పరిష్కారమయ్యే దాకా సహాయ కేంద్రాలు కొనసాగించడంతోపాటు ధరణిలో మాడ్యూళ్లు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
భూ సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న ఓ బాధితుడికి ఇటీవల ప్రజావాణిలో యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ రాసిచ్చిన సమాధానం ఇది. ‘తహసీల్దారు గారు.. ఈ సమస్యను పరిశీలించి, ధరణిలో ఎలా దరఖాస్తు చేయాలో వీరికి సలహా ఇవ్వండి’ అంటూ అదనపు కలెక్టర్ సూచన చేశారు. ఏం చేయాలో అర్థంకాక కలెక్టరేట్కు వస్తే.. అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే సమాధానం బాధితులకు ఎదురవుతుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!