మెరుగైన వైద్యం.. ఆరోగ్యంపై ధీమా
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అందరికీ మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ వడివడిగా పయనిస్తోందని ఆరోగ్య శాఖ పేర్కొంది. జాతీయ ఆరోగ్య సూచీల్లో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందని
రాష్ట్రంలో అయిదంచెలుగా సేవల విస్తరణ
వైద్య ఆరోగ్యశాఖ తాజా నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అందరికీ మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ వడివడిగా పయనిస్తోందని ఆరోగ్య శాఖ పేర్కొంది. జాతీయ ఆరోగ్య సూచీల్లో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందని స్పష్టం చేసింది. ఒక లక్ష ప్రసవాలకు 2014లో 92 ఉన్న మాతృ మరణాలు.. 2022 నాటికి 56కు తగ్గాయి. ప్రతి 1,000 ప్రసవాలకు 2014లో 39 ఉన్న శిశు మరణాలు.. 2022 నాటికి 23కి తగ్గాయి’’ అని తెలిపింది. మాతృ మరణాలను ప్రతి లక్షకు, శిశు మరణాలను ప్రతి వెయ్యికి లెక్కిస్తారు. ఇదే క్రమంలో 2014లో ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 41 ఉంటే, 2022 నాటికి ఆ సంఖ్య 30కి తగ్గిందని వివరించింది. 2014-22 వరకూ రాష్ట్రంలో వైద్యఆరోగ్య ప్రగతి నివేదికను మంగళవారం ఆ శాఖ విడుదల చేసింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీల్లో తెలంగాణ రాష్ట్రం కేరళ, తమిళనాడు తర్వాత 3వ స్థానంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రభుత్వం చేస్తున్న తలసరి వైద్యఖర్చు రూ.1,698 కాగా ఈ ప్రకారం చూస్తే హిమాచల్ప్రదేశ్, కేరళ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని వివరించింది.
వైద్య విద్యలో గణనీయమైన వృద్ధి
తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలే ఉండేవి. ఆ తర్వాత మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటల్లో కొత్తగా ప్రభుత్వం స్థాపించింది. జిల్లాకొక వైద్య కళాశాలను నెలకొల్పాలనే సీఎం సంకల్పానికి అనుగుణంగా.. తొలివిడతగా 2021లో సంగారెడ్డి, వనపర్తి, నాగర్కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో ఒక్కోదానికి రూ.510 కోట్ల వ్యయంతో అనుమతులు మంజూరు చేసింది. 2022-23 నుంచే వాటిలో తరగతులు ప్రారంభం కానున్నాయి. 2023-24లో మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. జిల్లాకొక వైద్య కళాశాల ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 5,240కి, పీజీ సీట్లు 2,500కు, సూపర్ స్పెషాలిటీ సీట్లు 1,000కు చేరుతాయి. ప్రభుత్వం వరంగల్లో రూ.1,100 కోట్లతో 2,000 పడకలతో హెల్త్సిటీని అభివృద్ధి చేయనుంది. మొత్తం రూ.2,679 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటి 1,000 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో హైదరాబాద్ నలువైపులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది’’ అని ఆరోగ్యశాఖ వివరించింది.
డైట్ ఛార్జీలను రోజుకు రూ.40 నుంచి రూ.80కి పెంచాం
‘‘గతంలో మూడంచెల వైద్యసేవలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం అయిదంచెలుగా విస్తరించారు. ప్రాథమిక సేవలకు పీహెచ్సీలు, ద్వితీయ స్థాయి సేవలకు జిల్లా ఆసుపత్రులు, స్పెషాలిటీ సేవలకు బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటికి అదనంగా బస్తీ/పల్లె దవాఖానాలు, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలకు టిమ్స్లు వస్తున్నాయి. ప్రాథమిక స్థాయిలో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 4,745 సబ్సెంటర్లను పల్లె దవాఖానాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 42 రక్తశుద్ధి కేంద్రాలను నెలకొల్పింది. వీటి సంఖ్యను త్వరలో 102కు పెంచనుంది. 21 ఆసుపత్రుల్లో సీటీస్కాన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు నిర్వహించడానికి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఆసుపత్రుల్లో క్యాథ్ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి పడకకూ చేస్తున్న ఖర్చును రూ.5వేల నుంచి రూ.7,500లకు పెంచింది. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలను రోజుకు రూ.40 నుంచి రూ.80లకు పెంచింది’’ అని ఆరోగ్యశాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి