Govt Jobs: 1,326 వైద్య పోస్టులకు పచ్చ జెండా
రాష్ట్రంలో 1,326 వైద్యుల పోస్టులను భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్బీ) ప్రకటనను వెలువరించింది. ఇందులో ప్రజారోగ్య విభాగంలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్
నియామక ప్రకటన వెలువరించిన వైద్య బోర్డు
ఒప్పంద, పొరుగు సేవల్లో వారికి 20 పాయింట్ల వెయిటేజి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 1,326 వైద్యుల పోస్టులను భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్బీ) ప్రకటనను వెలువరించింది. ఇందులో ప్రజారోగ్య విభాగంలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వైద్య విద్య సంచాలకుల విభాగంలో 357 ట్యూటర్ పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 211 సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్/జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులున్నాయి. ఈ నియామక ప్రకటన ద్వారా కొత్తగా నియమితులయ్యే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయరాదంటూ నిబంధనను విధించారు. ఎంబీబీఎస్, తత్సమాన అర్హత సాధించిన వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 14 సాయంత్రం 5 గంటలలోపు https://mhsrb.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు రుసుం రూ.200 ఆన్లైన్లో చెల్లించాలి. దరఖాస్తు పరిశీలన రుసుం రూ.120 మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ తదితర కేటగిరీలకు చెందినవారు చెల్లించక్కర్లేదు. మిగిలిన వారు పరిశీలన రుసుం చెల్లించాలి. అభ్యర్థులు 18-44 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు(టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్లు, పురపాలికల్లో పనిచేసే వారికి వర్తించదు), ఎక్స్ సర్వీస్మెన్కు మూడేళ్లు, ఎన్సీసీకి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకూ వయోపరిమితిని సడలించారు. ఈ పోస్టులన్నీ మల్టీజోనల్కు చెందినవి. ఇందులో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్లు 95 శాతం వర్తిస్తాయి. వంద పాయింట్లను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎంబీబీఎస్లో సాధించిన మార్కులను 80 పాయింట్లకు లెక్కిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రం వారి ఎంబీబీఎస్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. భారత్లో నిర్వహించే ‘ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్(ఎఫ్ఎంజీఈ)లో వారు సాధించిన మార్కులను లెక్కలోకి తీసుకుంటారు.
వెయిటేజికి కనీసం ఆర్నెల్ల నిబంధన
రాష్ట్ర ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 20 పాయింట్లను వెయిటేజిగా నిర్దేశించారు. ఈ పాయింట్లను కూడా ప్రాంతాల వారీగా విభజించారు. గిరిజన ప్రాంతాల్లో 6 నెలల పాటు పనిచేసిన వారికి 2.5 పాయింట్ల చొప్పున.. గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఆర్నెల్లకు 2 చొప్పున కేటాయిస్తారు. కనీసం ఆర్నెల్లు పనిచేసి ఉండాలనే నిబంధన విధించారు. వెయిటేజి ధ్రువపత్రాలను విభాగాధిపతుల నుంచి పొందాలి. ఇలా ఏ పోస్టుకు సంబంధించిన ధ్రువపత్రం పొందితే.. అదే పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.నిర్దేశించిన ప్రొఫార్మాలోనే ధ్రువపత్రాన్ని పొందాలి.వెయిటేజి మార్కులను నియామక ప్రకటన వెలువడిన తేదీ నాటికి లెక్కిస్తారు.
ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన పత్రాల వివరాలు
* ఆధార్ కార్డు
* ఎస్ఎస్సీ లేదా పదోతరగతి ధ్రువపత్రం
* ఎంబీబీఎస్ మార్కుల మెమో
* ఎంబీబీఎస్ సర్టిఫికెట్
* విదేశాల్లో అభ్యసించిన అభ్యర్థులైతే ఎఫ్ఎంజీఈ మార్కుల మెమో, సర్టిఫికెట్
* తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం
* ఒకటి నుంచి ఏడో తరగతి వరకూ విద్యాభ్యాస ధ్రువపత్రం
* ఇక్కడి పాఠశాలల్లో 1-7వ తరగతి వరకూ చదువుకోని అభ్యర్థులు స్థానికత సర్టిఫికెట్
* ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే సంబంధిత కుల ధ్రువీకరణ పత్రాలు
* బీసీలైతే నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్
* ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు తాజా ఆదాయ, ఆస్తుల అంచనా ధ్రువపత్రం
* క్రీడాకారులు సంబంధిత క్రీడా ధ్రువపత్రం
* దివ్యాంగులు సదరం.. ఎక్స్సర్వీస్మెన్, ఎన్సీసీ అయితే సంబంధిత ధ్రువపత్రం
* అభ్యర్థి ఫొటో, సంతకం ఫొటో
* అభ్యర్థులు దరఖాస్తు పత్రంలోని అన్ని కాలమ్స్ తప్పనిసరిగా పూర్తిచేయాలి. అసంపూర్తి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
* తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించిన వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ