Telangana News: గ్రూపు-4 ఉద్యోగాలన్నింటికీ ఒకే నోటిఫికేషన్‌!

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదానికి పంపినట్లు తెలుస్తోంది.

Updated : 24 Jun 2022 08:36 IST

 9,618 ఖాళీల గుర్తింపు

సీఎం ఆమోదానికి దస్త్రం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదానికి పంపినట్లు తెలుస్తోంది. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు తదితర ఉద్యోగాలున్నాయి. అన్ని జిల్లాల్లో, శాఖాధిపతుల కార్యాలయాల్లో కిందిస్థాయిలోని ఈ పోస్టులు చాలా ఖాళీగా ఉండడం వల్ల పరిపాలన పరమైన సమస్యలు ఏర్పడుతున్నందున వీటిని త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం నిర్ణయం మేరకు నోటిఫికేషన్‌పై తుది నిర్ణయం తీసుకునే వీలుంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గ్రూపు-4 పోస్టుల భర్తీపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలం తర్వాత గ్రూపు-1 పోస్టులు భర్తీ అవుతున్నందున వాటికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌తో పాటు ఇతర నియామక సంస్థల నుంచి సలహాలు తీసుకున్నారు. అన్నింటిని క్రోడీకరించి దస్త్రంగా రూపొందించి సీఎం ఆమోదానికి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని