ఏడు నుంచి కాకతీయ ఉత్సవాలు

ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు వరంగల్‌లో గతంలో కాకతీయుల ఉత్సవాలు వైభవంగా జరిగేవి. 2015 వరకు ఏటా ప్రభుత్వం తరఫున నిర్వహించేవారు. ఆ తర్వాత మళ్లీ ఉత్సవాలు

Published : 24 Jun 2022 02:49 IST

 ముఖ్యఅతిథిగా కాకతీయుల వారసుడికి ఆహ్వానం

హనుమకొండతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహణ

ఈనాడు, వరంగల్‌ : ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు వరంగల్‌లో గతంలో కాకతీయుల ఉత్సవాలు వైభవంగా జరిగేవి. 2015 వరకు ఏటా ప్రభుత్వం తరఫున నిర్వహించేవారు. ఆ తర్వాత మళ్లీ ఉత్సవాలు జరగలేదు. తాజాగా జులై ఏడు నుంచి ఈ ఉత్సవాలను వారం రోజుల పాటు అంగరంగవైభవంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా కాకతీయుల వారసుడు రానున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లాలోని జగ్దల్‌పుర్‌లో ఉండే కమల్‌చంద్ర భంజ్‌ కాకతీయను రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, యువ చరిత్రకారుడు అరవింద్‌ ఆర్యలు వెళ్లి గురువారం ఆయనకు ఆహ్వాన పత్రం ఇచ్చారు. తన తల్లి, సోదరితో వస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది.  
700 చిత్రాలతో ప్రదర్శన
‘టార్చ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ కాకతీయులపై గత కొన్ని నెలలుగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఉత్సవాల సందర్భంగా ఈ సంస్థ కాకతీయుల నిర్మాణాలపై సేకరించిన 700 చిత్రాలతో ప్రదర్శన, ఇంకా కాకతీయుల వైభవాన్ని చాటిచెప్పే అనేక కార్యక్రమాలుంటాయని మామిడి హరికృష్ణ తెలిపారు. ఉత్సవాలను హనుమకొండతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు