వానాకాలం లక్ష్యం 52 లక్షల ఎకరాలు
ఆరుతడి పంటలు 19.80 లక్షలు
వరిసాగు 32.20 లక్షలు
జులైలో నీటి విడుదల ప్రారంభం
నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో నిర్ణయం
ఈనాడు హైదరాబాద్: ప్రస్తుత వానాకాలంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరులు, ఎత్తిపోతలు.. ఇలా అన్ని సాగునీటి వనరుల కింద 52 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ప్రతిపాదించారు. ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 38 లక్షల ఎకరాలు కాగా, మిగిలింది చెరువులు, చిన్న ఎత్తిపోతల పథకాల కింద ఉంది. కాళేశ్వరం, శ్రీరామసాగర్, దేవాదుల, కల్వకుర్తి, భీమా ఇలా అనేక ప్రాజెక్టుల కింద చెరువులను నింపి నీటిని అందించనున్నారు. ఇందులో ఆయకట్టు పరిధిలోనే కాకుండా దాని బయట కూడా చెరువులు ఉండడంతో వాటి కిందనే 97.80 టీఎంసీలతో 11.30 లక్షల ఎకరాలను ప్రతిపాదించారు. వానాకాలంలో ప్రతిపాదిత ఆయకట్టుకు 506.25 టీఎంసీల నీరు అవసరమని అంచనా వేశారు. మొత్తం ఆయకట్టులో 32.20 లక్షల ఎకరాల్లో వరి కాగా, మిగిలినవి ఆరుతడి పంటలు. ఈ మేరకు అన్ని జిల్లాల చీఫ్ ఇంజినీర్లు ఇచ్చిన ప్రతిపాదనలపై సమీకృత సాగునీటి యాజమాన్యం, నిర్వహణకు సంబధించిన ఉన్నతస్థాయి కమిటీ గురువారం సమావేశమై చర్చించింది. నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈఎన్సీలు శంకర్, నాగేందర్రావు, వెంకటేశ్వర్లు, అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు, పలువురు ఎస్ఈలు పాల్గొన్నారు. ప్రాజెక్టుల వారీగా ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, ఆయకట్టు సాగు, ప్రాజెక్టుల నుంచి చెరువులు నింపి ఆయకట్టుకు నీళ్లివ్వడం తదితర అంశాలపై వివరంగా చర్చించారు. జులైలో ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం ప్రారంభించాలని, ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ప్రవాహాలను పరిగణనలోకి తీసుకొని తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీరామసాగర్, శ్రీరామసాగర్ రెండోదశ, నాగార్జునసాగర్, ఎ.ఎం.ఆర్.పి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, నిజాంసాగర్, జూరాల తదితర ప్రాజెక్టుల కింద అత్యధిక ఆయకట్టుకు నీరందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 57,600 ఎకరాలకు నీటిని సరఫరా చేసేందుకు 5.75 టీఎంసీలు అవసరమని అంచనా వేశారు. దీంతోపాటు ఆయకట్టు పరిధిలోనూ, దాని బయట 24 టీఎంసీలతో 6,200 చెరువులను నింపి 2.3 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. శ్రీరామసాగర్, నిజాంసాగర్, భీమా, కల్వకుర్తి.. ఇలా అన్ని ప్రాజెక్టుల కింద అత్యధికంగా చెరువులను నింపి నీటిని సరఫరా చేయనున్నారు. కాలువలకు నీటిని విడుదల చేసే ముందుగా మరమ్మతు పనులు ఏమైనా ఉంటే పూర్తి చేయాలని ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ సూచించారు. సమావేశంలో చర్చించిన అంశాలతో ప్రతిపాదనను నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి పంపనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
-
Movies News
Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
-
World News
Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
-
India News
Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
-
Sports News
World Chess: ప్రపంచ చెస్ ఫెడరేషన్ (FIDE) ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్
-
Movies News
Social Look: మేకప్మ్యాన్ని మెచ్చిన సన్నీ లియోనీ.. విజయ్తో అనన్య స్టిల్స్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- US: భారతీయ మహిళ బలవన్మరణం.. స్పందించిన న్యూయార్క్ కాన్సులేట్ జనరల్
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
- Rishi Sunak: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ ఫిర్యాదు ఏంటో తెలుసా..?
- CWG 2022: రసవత్తర ఫైనల్ పోరు.. వెండితో సరిపెట్టుకున్న భారత్