రెడ్‌కో ఛైర్మన్‌గా సతీష్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌రెడ్‌కో) కొత్త ఛైర్మన్‌గా వై.సతీష్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Published : 25 Jun 2022 03:08 IST

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌రెడ్‌కో) కొత్త ఛైర్మన్‌గా వై.సతీష్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ, ప్రభుత్వ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్‌రావు, తాత మధు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌, ఆరూరి రమేశ్‌ పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రులు మాట్లాడారు. సీఎం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని సతీష్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు