రాకేష్‌ సోదరుడికి ఉద్యోగంపై ఉత్తర్వులు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో జరిగిన కాల్పుల్లో వరంగల్‌ జిల్లాకు చెందిన దామెర రాకేష్‌ మరణించగా అతడి సోదరుడు రామ్‌రాజుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ

Updated : 25 Jun 2022 05:46 IST

కారుణ్య నియామకం కోసం వరంగల్‌ కలెక్టర్‌కు సీఎస్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో జరిగిన కాల్పుల్లో వరంగల్‌ జిల్లాకు చెందిన దామెర రాకేష్‌ మరణించగా అతడి సోదరుడు రామ్‌రాజుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఈనెల 17న జరిగిన ఆందోళనల్లో కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాకేష్‌ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ... అతని కుటుంబ సభ్యులలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కారుణ్య నియామకాల కింద  రామ్‌రాజు విద్యార్హతలకు అనుగుణంగా వరంగల్‌ జిల్లాలో తగిన ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ను సీఎస్‌ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని