ముఖ్యమంత్రి వద్దకు ఆర్‌జీయూకేటీ కులపతి దస్త్రం!

బాసరలోని ఆర్‌జీయూకేటీకి కులపతిని నియమించేందుకు అవసరమైన దస్త్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు చేరినట్లు సమాచారం. వారం రోజుల్లో ఛాన్సలర్‌ను నియమిస్తామని ప్రభుత్వం

Published : 25 Jun 2022 05:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: బాసరలోని ఆర్‌జీయూకేటీకి కులపతిని నియమించేందుకు అవసరమైన దస్త్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు చేరినట్లు సమాచారం. వారం రోజుల్లో ఛాన్సలర్‌ను నియమిస్తామని ప్రభుత్వం విద్యార్థులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కులపతి నియామకంపై చర్యలను వేగవంతం చేసింది. పారిశ్రామికవేత్తలను లేదా పరిశ్రమలతో సంబంధం ఉన్న వారిలో ఒకరిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. వారిలోనూ పీహెచ్‌డీ/గౌరవ డాక్టరేట్‌ పట్టా ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారని చెబుతున్నారు. కొన్నిరోజుల్లోనే కులపతిని ఖరారుచేసే అవకాశముందని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని