ఇలాగైతే సం‘పత్తి’ బాగు
రాష్ట్రంలో ప్రధాన పంటగా మారిన పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టాయి. విత్తడం నుంచి దూది తీసేవరకూ యంత్రాలతో సాగు
విత్తడం మొదలు చివరికి దూది తీసేదాకా యంత్రమే
ముందుకొచ్చే రైతులకు ఎకరానికి రూ.4 వేల సాయం
ప్రయోగాత్మక విధానానికి వ్యవసాయ శాఖ, జయశంకర్ వర్సిటీ శ్రీకారం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన పంటగా మారిన పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టాయి. విత్తడం నుంచి దూది తీసేవరకూ యంత్రాలతో సాగు చేసేందుకు ఎంపిక చేసిన రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలో సొమ్ము వేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. సాధారణ పద్ధతిలో ఈ పంట సాగుకు ప్రస్తుతం ఎకరానికి రెండు విత్తన ప్యాకెట్లను రైతులు వినియోగిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ బరువు 450 గ్రాములు. ధర రూ.810. ఎకరానికి రూ.1,620 చెల్లించి విత్తనాలను కొంటున్నారు. కానీ 25 వేల విత్తనాలతో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయాలంటే కనీసం 5 ప్యాకెట్లు అవసరం. రైతుకు పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. అందుకే వారికి ఆర్థిక సాయం చేయాలని జయశంకర్ వర్సిటీ సిఫార్సు చేసింది. ఈ సీజన్లో 70 లక్షల ఎకరాలకు పైగా ఈ పంట సాగు చేయించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని రకాల పంటల సాగు విస్తీర్ణం కోటీ 42 లక్షల ఎకరాలు కాగా ఇందులో పత్తి ఒక్కటే దాదాపు సగం ఉండాలని నిర్ణయించింది. గతేడాది ఇది 46.42 లక్షల ఎకరాల్లో సాగైంది.
* పరిశోధన కేంద్రాలకు పది అధునాతన యంత్రాలు ఎంపిక చేసిన రైతుల పొలాలకు అన్నదాతలను పిలిచి వారి సమక్షంలో యంత్రంతో విత్తనాలు విత్తాలని రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పరిశోధనకేంద్రాల శాస్త్రవేత్తలకు వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి(వీసీ) ప్రవీణ్రావు ఆదేశాలు జారీచేశారు.
* ఇలా అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాలను కొన్ని చోట్ల జయశంకర్ వర్సిటీ, ప్రైవేటు కంపెనీలతో కలసి ప్రారంభించింది. ఇందుకోసం అన్ని పరిశోధన కేంద్రాలకు పది అధునాతన యంత్రాలను సరఫరా చేశారు. పలు గ్రామాల్లో ఇప్పటికే రైతుల సమక్షంలో శాస్త్రవేత్తలు యంత్రంతో పత్తి విత్తుతున్నారు.
* యంత్రాలతో పత్తి సాగుకు ఆసక్తి చూపే రైతులను వ్యవసాయశాఖ మండలాలవారీగా ఎంపిక చేస్తోంది. అధిక సాంద్రతలో సాగు వల్ల దిగుబడి పెరుగుతుందని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు ‘ఈనాడు’కు చెప్పారు. ‘‘ఇదొక ప్రయోగాత్మక కార్యక్రమం. కనీసం నలభై వేల నుంచి యాభై వేల మంది వరకూ ముందుకొస్తారని అంచనా వేస్తున్నాం. రైతులు ఆసక్తి కనబరిస్తే వర్సిటీ యంత్రాలు, విత్తనాలను సమకూర్చడం వంటి కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది’’ అని తెలిపారు.
* యంత్రంతో కేవలం 45 నిమిషాల్లో ఎకరానికి 25 వేలకు పైగా విత్తనాలను నాటవచ్చు. ఇందుకోసం రైతు యంత్రం అద్దె కింద రూ.1,500 చెల్లిస్తే సరిపోతుంది. అదే సాధారణ పద్ధతిలో ఐదారుమంది కూలీలు రోజంతా పనిచేస్తే ఎకరా విస్తీర్ణంలో 7,500 విత్తనాలను విత్తుతున్నారు. వారికి కూలి కింద రూ.2,500 నుంచి రూ.3,500 దాకా చెల్లించాల్సి వస్తోంది. యంత్రం వినియోగిస్తే నేరుగా కూలి రేటు బాగా కలిసొస్తుంది.
* ఎకరానికి ప్రస్తుతం 7,500 మొక్కలతో పత్తి పంట సాగవుతోంది. ఇప్పుడు ఆ సంఖ్యను 25 వేలకు పెంచితే పంట దిగుబడి పెరుగుతుంది.
* కూలీల కొరత, కూలి రేట్లు బాగా పెరిగినందున పత్తి సాగు వ్యయం అధికమైంది. క్వింటా పత్తి పండించాలంటే రాష్ట్రంలో రైతు సగటున రూ.11,376 చొప్పున పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఈ ఖర్చు తగ్గాలంటే యంత్రాల వినియోగంతో పాటు, ఉత్పాదకతను పెంచాలి.
- జయశంకర్ వర్సిటీ సిఫార్సు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!