ఉపాధ్యాయులూ ఆస్తుల వివరాలివ్వండి.. ఉత్తర్వులు.. ఉపసంహరణ
‘‘ఉపాధ్యాయులు తమ స్థిర, చర ఆస్తుల వివరాలను; క్రయవిక్రయాల సమస్త సమాచారాన్ని ఏటా ప్రకటించాలి. స్థిర, చరాస్తులను కొనాలన్నా...అమ్మాలన్నా ముందస్తుగా అనుమతి తీసుకోవడం
కొనాలన్నా... అమ్మాలన్నా అనుమతి తప్పనిసరన్న విద్యాశాఖ
టీచర్లలో కలవరంతో స్పందించిన ప్రభుత్వం
వెంటనే నిలిపివేయాలని మంత్రి సబితారెడ్డి ఆదేశం
ఈనాడు, హైదరాబాద్; న్యూస్టుడే, దేవరుప్పుల: ‘‘ఉపాధ్యాయులు తమ స్థిర, చర ఆస్తుల వివరాలను; క్రయవిక్రయాల సమస్త సమాచారాన్ని ఏటా ప్రకటించాలి. స్థిర, చరాస్తులను కొనాలన్నా...అమ్మాలన్నా ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి’’ అని పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. తక్షణమే ఆపేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని ఆమె విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఆస్తుల వెల్లడిపై జారీ అయిన ఉత్తర్వులతో ఉపాధ్యాయుల్లో కలవరం రేగింది. ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష కట్టిందని రాజకీయ పార్టీలు విమర్శించాయి. స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
ఇవీ ఉత్తర్వులు...
‘‘విద్యాశాఖలోని ప్రతి ఉద్యోగి తన ఆస్తులను వార్షిక ఆస్తుల స్టేట్మెంట్ రూపంలో ఏటా ఉన్నతాధికారులకు సమర్పించాలి. తన పేరిట ఉన్న చర, స్థిర ఆస్తులను విక్రయించాలన్నా, కొనాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలి’’ అని పేర్కొంటూ ఈనెల 8న ఆర్సీ నంబరు 192/ఎస్టాబ్లిష్మెంట్-1/2022తో పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు, ఫ్లాట్లు, దుకాణాలు, ప్లాట్లు, సాగు భూములు.. ఇలా 9 రకాలను అందులో ప్రస్తావించింది. ఆస్తిని కొంటే సర్వే నంబరు, స్వాధీనంలోకి వచ్చిన తేదీ, చెల్లించిన ధర.. తదితర వివరాలను సమగ్రంగా సమర్పించాలని పేర్కొంది. అమ్మినా సరే పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపింది. ఈ ఆదేశాలు ఉపాధ్యాయుల్లో కలవరం రేపాయి. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఈ ఉత్తర్వులు కేవలం ఉపాధ్యాయులకే పరిమితం కాదని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వర్తిస్తాయని తెలిపారు. విజిలెన్స్ నివేదిక నేపథ్యంలో తాజాగా మరోసారి ఆదేశాలు ఇచ్చామన్నారు. విద్యాశాఖలో సుమారు 1.10లక్షల మంది ఉపాధ్యాయులు... నాన్టీచింగ్ సిబ్బంది ఇతర ఉద్యోగులు దాదాపు 20 వేల మంది ఉంటారు.
జావేద్ అలీపై విజిలెన్స్ నివేదికతో...
మూడేళ్ల క్రితం కూడా ఇలాంటి ఉత్తర్వులే విద్యాశాఖ ఇచ్చింది. ఉపాధ్యాయుల ఆందోళనతో వివరాల వెల్లడి అవసరం లేదని ఆనాడు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆ తర్వాత వాటిని ఎవరూ పట్టించుకోలేదు. తాజా ఉత్తర్వులకు జావేద్ అలీ ఉదంతమే కారణం. ఫిర్యాదుల నేపథ్యంలో నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహమ్మద్ జావేద్ అలీపై సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) పరిధిలో పనిచేసే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు విచారణ జరిపి నివేదికను సమర్పించారు. ‘‘జావేద్ అలీ విధులకు సరిగా హాజరు కావడం లేదు. రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్థిరాస్తి వ్యాపారం, వక్ఫ్బోర్డు సెటిల్మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమే’’ అని విజిలెన్స్ అధికారులు 2021 ఏప్రిల్లో నివేదికను సమర్పించారు. ‘‘ఆస్తులు కొనే ముందు విద్యాశాఖ అనుమతి తీసుకోలేదు. వార్షిక ఆస్తుల వివరాలను సమర్పించలేదు. ఆయనపై శాఖాపరమైన చర్యలతోపాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికీ వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వాలి’’ అని సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ తాజా ఆదేశాలను జారీ చేసింది. అలాగే ఉపాధ్యాయులకు బయో మెట్రిక్ హాజరు అమలు చేయాలని కూడా విజిలెన్స్ సిఫార్సు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు