Telangana News: ఆ విద్యార్థుల సర్దుబాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
ప్రమాణాల ప్రకారం వసతుల్లేని వైద్య కళాశాలల అనుమతులను రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) స్పష్టంచేసింది. విద్యార్థుల మెరిట్,
హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎన్ఎంసీ
ఈనాడు, హైదరాబాద్: ప్రమాణాల ప్రకారం వసతుల్లేని వైద్య కళాశాలల అనుమతులను రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) స్పష్టంచేసింది. విద్యార్థుల మెరిట్, ఇతర కాలేజీల్లో ఖాళీల ఆధారంగా సీట్లను సర్దుబాటు చేయాలంది. ఒకవేళ సీట్లు ఖాళీగా లేనిపక్షంలో ఈ ఒక్కసారికి వాటిని పెంచాల్సి ఉంటుందని.. ఇందుకు కేంద్రం అనుమతి మంజూరు చేస్తుందని తెలిపింది. తమ ప్రవేశాలను రద్దు చేసి.. సర్దుబాటుకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఎంఎన్ఆర్ వైద్య కళాశాల పీజీ విద్యార్థులు డాక్టర్ ఎం.వర్షిణి, మరో 47 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఎంసీ తరఫున కార్యదర్శి ప్రభాత్కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఆవశ్యకత ధ్రువీకరణ పత్రం ఆధారంగా మెడికల్ అడ్మిషన్లకు అనుమతి మంజూరవుతుందని.. ఎన్ఎంసీల నిబంధనల ప్రకారం కనీస ప్రమాణాలు పాటించని పక్షంలో ప్రవేశాలను నిలిపివేస్తామన్నారు. అందువల్ల అనుమతులు రద్దయిన కళాశాలల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఇందుకు ఇతర కాలేజీల్లో మౌలిక వసతులు, వనరులను పరిశీలించి సీట్ల సంఖ్యను పెంచాలని, అయితే అండర్ గ్రాడ్యుయేట్లో 250కి మించకూడదన్నారు. పీజీ సీట్లను కూడా సర్దుబాటు చేయాలన్నారు. సీట్ల రద్దు సమయంలోనే రాష్ట్రానికి మార్గదర్శకాలను పంపామని, విద్యార్థులు ఎంత ఫీజు చెల్లించాలో కూడా పేర్కొన్నామని స్పష్టంచేశారు.
సీట్లను పెంచాకే ప్రవేశాలు: రాష్ట్ర ప్రభుత్వం
అనుమతులు రద్దయిన కళాశాలల విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయడానికి ముందుగా ఎన్ఎంసీ సూపర్ న్యూమరరీ సీట్లను సృష్టించాల్సి ఉందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అనుమతుల రద్దుపై కాలేజీలు దాఖలు చేసిన అప్పీళ్లపై ఎన్ఎంసీ నిర్ణయం తీసుకునేదాకా.. వాటిపై చర్యలు తీసుకోవద్దంటూ ఈ కోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. ఎంఎన్ఆర్, మహావీర్ కళాశాలల్లోని 450 యూజీ, 100 పీజీ సీట్లను సర్దుబాటు చేయాల్సి ఉందని.. ప్రస్తుతం ఉన్న కాలేజీల్లో ఎంత శాతం సీట్లు పెంచాలన్నదానిపై ప్రతిపాదనలు పంపాల్సి ఉందని తెలిపింది. రాష్ట్రంలో 9 ప్రభుత్వ, 1 ఈఎస్ఐసీ, 19 నాన్-మైనారిటీ, 4 ప్రైవేట్ మైనారిటీ కళాశాలలున్నాయంది. ఇందులో ఉస్మానియా, గాంధీ, కాకతీయ కాలేజీల్లో గరిష్ఠంగా 250 సీట్లు ఉన్నాయని, వీటిలో సీట్ల పెంపునకు నిబంధనలు అనుమతించవంది. మహబూబ్నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా నిమిత్తం మంజూరైన సీట్ల కంటే ఎక్కువ అడ్మిషన్లు చేపట్టినట్లు తెలిపింది. వీటిలో అదనపు ప్రవేశాలకు వసతులు లేవంది. నల్గొండ, సూర్యాపేటల్లో రెండేళ్ల క్రితమే కళాశాలలు ప్రారంభమయ్యాయని, ఇక్కడ కొత్త అడ్మిషన్లకు వసతి గృహాలు లేవంది. ఎన్ఎంసీ సీట్లను సృష్టించాక వెబ్కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపింది. అదనపు అడ్మిషన్లు చేపట్టడానికి ప్రైవేటు కాలేజీలకూ ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ పిటిషన్పై హైకోర్టు జులై 7న విచారణ చేపట్టనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల