‘సమతామూర్తి’లో ప్రసాదం విక్రయాలపై కేసు

శంషాబాద్‌ ముచ్చింతల్‌ సమీపంలో నిర్మించిన సమతామూర్తి కేంద్రంలో నిబంధనలు పాటించకుండా ప్రసాదాల విక్రయాలు చేపట్టడంపై తూనికలు, కొలతలు శాఖాధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన వి.వినయ్‌ ప్రసాదం ప్యాకెట్‌

Published : 26 Jun 2022 04:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌ ముచ్చింతల్‌ సమీపంలో నిర్మించిన సమతామూర్తి కేంద్రంలో నిబంధనలు పాటించకుండా ప్రసాదాల విక్రయాలు చేపట్టడంపై తూనికలు, కొలతలు శాఖాధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన వి.వినయ్‌ ప్రసాదం ప్యాకెట్‌ కొనుగోలు చేయగా దానిపై బరువు, తయారీ, ముగింపు తేదీలు ముద్రించకపోవడాన్ని గుర్తించి.. తూనికలు కొలతల శాఖకు ఈ-మెయిల్‌లో ఫిర్యాదుచేశారు. రంగారెడ్డి జిల్లా శాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు చేపట్టి కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని