అధికారమిస్తే పేదలకు ఎకరం భూమి
అనేక పోరాటాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో కబ్జా అయిందని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తమ పార్టీ గుర్తు ఐరావతం చిత్రంతో కూడిన నీలి జెండాను ప్రగతి భవన్పై ఎగురవేస్తామని వక్తలు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇసుకదందా పెరిగింది
హనుమకొండ సభలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్
వరంగల్ (బాలసముద్రం), న్యూస్టుడే : అనేక పోరాటాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో కబ్జా అయిందని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తమ పార్టీ గుర్తు ఐరావతం చిత్రంతో కూడిన నీలి జెండాను ప్రగతి భవన్పై ఎగురవేస్తామని వక్తలు పేర్కొన్నారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ప్రారంభించిన బహుజన రాజ్యాధికారయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం హనుమకొండలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభాధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ బీఎస్పీకి అధికారం అప్పగిస్తే కులమతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తామన్నారు. అర్హులైన కుటుంబాల నుంచి ఒకరిని విదేశాల్లో విద్యకు పంపిస్తామన్నారు. గడిచిన వంద రోజుల్లో 15,000 కిలో మీటర్లు పర్యటించి 750 గ్రామాలను సందర్శించామన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు కనిపించడంలేదన్నారు. ప్రజలు నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన తెరాస ఎమ్మెల్యేలకు ఆత్మగౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేసి బీఎస్పీలో చేరాలన్నారు. రాష్ట్రంలో ఇసుక దందా విపరీతంగా పెరిగిందన్నారు. ఆదివాసీల పేరుతో ఇసుక క్వారీలు తీసుకొని అగ్రకులాల వారు రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు, ఏడు రాష్ట్రాల కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ మాట్లాడుతూ 2023లో రాజ్యాధికారం సాధించే దిశగా కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలన్నారు. నేషనల్ కోఆర్డినేటర్ ఆకాశ్ ఆనంద్ తదితరులు మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!