వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా సురేందర్‌రెడ్డి, పండరినాథ్‌

విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వీరన్నగారి సురేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా శాలివాహన పండరినాథ్‌ ఎన్నికయ్యారు. చెన్నైలో ఈ నెల 24 నుంచి 27 వరకు జరుగుతున్న వీహెచ్‌పీ జాతీయ కార్యవర్గ

Published : 27 Jun 2022 05:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వీరన్నగారి సురేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా శాలివాహన పండరినాథ్‌ ఎన్నికయ్యారు. చెన్నైలో ఈ నెల 24 నుంచి 27 వరకు జరుగుతున్న వీహెచ్‌పీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ ఎన్నిక నిర్వహించారు. రాష్ట్ర కొత్త అధ్యక్ష, కార్యదర్శులిద్దరూ మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రామరాజు తెలంగాణ ప్రాంత సలహా సభ్యులుగా, అఖిలభారత మఠ్‌ మందిర్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బండారి రమేష్‌ బెంగళూరు క్షేత్ర సేవాప్రముఖ్‌గా నియమితులయ్యారని వీహెచ్‌పీ తెలంగాణ అధికార ప్రతినిధి పగుడాకుల బాలస్వామి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని