పీవీ స్ఫూర్తితో పురోగమనం: సీఎం

తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని నిరూపించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తమ

Published : 28 Jun 2022 03:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని నిరూపించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తమ కార్యాచరణలోనే అది ఇమిడి ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మంగళవారం పీవీ జయంతిని పురస్కరించుకొని ఆయనకు సీఎం నివాళులర్పించారు. ‘‘క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ. ప్రధానిగా ఆయన చేపట్టిన విధానాలతో దేశం అన్ని రంగాల్లో పురోగమించింది. ఆయన బాటలోనే పయనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది’’ అని సీఎం పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని