ఏకరూప దుస్తుల రంగు మార్పు

కొత్త విద్యాసంవత్సరం(2022-23)లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరఫరా చేయనున్న ఏకరూప దుస్తుల రంగు, డిజైన్‌ మారింది. గతంలో నీలం రంగు చొక్కా, సిరా రంగు నిక్కరు

Published : 28 Jun 2022 08:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త విద్యాసంవత్సరం(2022-23)లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరఫరా చేయనున్న ఏకరూప దుస్తుల రంగు, డిజైన్‌ మారింది. గతంలో నీలం రంగు చొక్కా, సిరా రంగు నిక్కరు అందజేసేవారు. ఈ విద్యాసంవత్సరం తెల్ల వస్త్రంపై ఎరువు గడులతో కూడిన చొక్కాలు, కాఫీ రంగు నిక్కరు ఇవ్వనున్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రెండు జతల యూనిఫాంకు అవసరమైన 1.40 కోట్ల మీటర్ల వస్త్రాన్ని సరఫరా చేస్తామని తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ(టెస్కో) ఇటీవల విద్యాశాఖకు తెలిపింది. మొదటి విడతలో.. ఒక జత ఇచ్చేందుకు అవసరమైన వస్త్రం కొన్ని జిల్లాల్లోని మండల కేంద్రాలకు చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని