ప్రజాగ్రహవాణి
రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టరేట్లు సోమవారం ప్రజల ధర్నాలు, నిరసనలతో అట్టుడికాయి. ప్రజావాణి కార్యక్రమానికి అనేక గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా వచ్చి ఫిర్యాదులు చేశారు. జగిత్యాల జిల్లా
ఫిర్యాదులు.. ధర్నాలతో వేడెక్కిన కలెక్టరేట్లు
మూడొంతులు భూ సమస్యలపైనే..
తరలివచ్చిన నిర్వాసిత గ్రామాలు
ఈనాడు, హైదరాబాద్- న్యూస్టుడే యంత్రాంగం: రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టరేట్లు సోమవారం ప్రజల ధర్నాలు, నిరసనలతో అట్టుడికాయి. ప్రజావాణి కార్యక్రమానికి అనేక గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా వచ్చి ఫిర్యాదులు చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ఏళ్లతరబడి సమస్యలను నాన్చుతున్నారంటూ చాలా చోట్ల బాధితులు ధర్నాలు నిర్వహించారు. కలెక్టర్లకు వచ్చిన ఫిర్యాదుల్లో మూడొంతులు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. నిర్వాసితుల సమస్యలు, పింఛన్లు, రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుపైనా విజ్ఞప్తులు వచ్చాయి.
* జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన రైతు గాజుల సాంబయ్య కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. తన 2.19 ఎకరాల సాగుభూమిని రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సమస్యని పరిష్కరించాలంటూ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
* ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న తమకు భూ యాజమాన్య హక్కులు కల్పించడంలేదంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నిమ్మగూడెం రైతులు ప్రజావాణికి తరలివచ్చి ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి ముంపు ప్రాంత రైతులు పరిహారం కోరుతూ కలెక్టర్ భవేశ్ మిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు. మొత్తం 35 దరఖాస్తులు ఇక్కడి ప్రజావాణి కార్యక్రమానికి రాగా వాటిలో 20 వరకు భూ సంబంధిత సమస్యలే ఉన్నాయి.
* సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని మధ్య మానేరు ముంపు గ్రామం శబాష్పల్లిని 2017లో ఖాళీ చేయించారు. పరిహారం ప్యాకేజి కింద 375 రోజులకు రూ.100 చొప్పున వ్యక్తిగత పరిహారం ఇచ్చారు. ఇతర గ్రామాల్లో రూ.175 చొప్పున ఇచ్చారని, తమకు తక్కువ ఇవ్వడంతో ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు నష్టం వాటిల్లిందంటూ ముంపు బాధితులు 300 మంది ట్రాక్టర్లపై కలెక్టరేట్కు తరలి వచ్చారు. త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ అనురాగ్ జయంతి ఫోన్లో హామీ ఇచ్చారు.
* సంగారెడ్డి జిల్లాలోని గణపతి చక్కెర కర్మాగారం కార్మికులు, రైతులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. లాక్అవుట్ నోటీసును ఉపసంహరించుకుని, ఫ్యాక్టరీని నడిపించేలా చూడాలని.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ఎ.శరత్ను కలిసి వినపత్రం ఇచ్చారు. కొండాపూర్ మండల పరిధిలోని మునిదేవునిపల్లిలోని మూడు సర్వే నంబర్లలో 600 ఎకరాల్లో ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న తమకు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతూ రైతులు ధర్నా నిర్వహించారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన 448 మంది గిరిజనులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. సీలింగ్ భూములకు హద్దులు నిర్ణయించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా న్యాయం చేయాలని కలెక్టర్ అనుదీప్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
* మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లోని పోడు భూముల చుట్టూ కందకాల తవ్వకాలను నిలిపివేయాలని ఆ గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. వారసత్వంగా వస్తున్న అటవీ భూములను సాగు చేసుకుంటున్నామని, పట్టాలు జారీచేసి న్యాయం చేయాలని కలెక్టర్ కె.శశాంకకు వినతి పత్రం అందించారు.
* రెండు పడక గదుల గృహాలు కేటాయించడం లేదంటూ మహబూబ్నగర్ పురపాలక సంఘం పరిధిలోని వివిధ కాలనీల మహిళలు కలెక్టరేట్కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
సర్పంచిపై వేటు
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ సర్పంచి భర్త కొప్పుల దేవేందర్.. మండల పంచాయతీ అధికారి రాజశేఖర్పై దాడిచేశారంటూ ఆ మండలానికి చెందిన యంత్రాంగం కలెక్టరేట్కు వచ్చి అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్కు ఫిర్యాదు చేసింది. దీంతో సర్పంచి సంధ్యారాణిపై సస్పెన్షన్ వేటు వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు