సంక్షిప్త వార్తలు
ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్) ప్రవేశ పరీక్ష-2022 దరఖాస్తులకు జులై 26 చివరి తేదీగా నిర్ణయించినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం తెలిపారు. వర్సిటీతో పాటు అపోలో ఇన్స్టిట్యూట్
‘ఎంబీఏ’ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు గడువు జులై 26
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్) ప్రవేశ పరీక్ష-2022 దరఖాస్తులకు జులై 26 చివరి తేదీగా నిర్ణయించినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం తెలిపారు. వర్సిటీతో పాటు అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ (ఏఐహెచ్సీఎం), కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (కిమ్స్), దారుస్సలాం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (డీఈటీ) ఆసుపత్రి మేనేజ్మెంట్ విభాగాల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in ద్వారా దరఖాస్తు నింపి, పరీక్ష రుసుం ఆన్లైన్లో లేదా తెలంగాణ ఆన్లైన్ ఫ్రాంఛైజీల ద్వారా చెల్లించి రసీదు పొందాలన్నారు. పూర్తి వివరాలకు 040-23680441/241/246 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వర్సిటీ అధికారులు కోరారు.
బీఈడీ, ఎల్ఎల్బీకి గరిష్ఠ ఫీజు రూ.36 వేలు
ఈనాడు, హైదరాబాద్: బీఈడీ, ఎల్ఎల్బీకి గరిష్ఠ ఫీజు రూ.36 వేలుగా తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ఖరారు చేసింది. కనిష్ఠంగా రూ.20 వేలు ఉంటుంది. ఎల్ఎల్ఎంకి గరిష్ఠంగా రూ.42 వేలు, కనిష్ఠం రూ.20 వేలు, బీపీఈడీకి గరిష్ఠం రూ.28 వేలు, కనిష్ఠం రూ.17 వేలుగా ఖరారు చేశారు.
శ్రీచైతన్య విద్యాసంస్థల జయకేతనం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అన్ని గ్రూపుల్లో తమ విద్యార్థులు మంచి మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ, అధినేత బి.ఎస్.రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్ ఇంటర్లో ముగ్గురు 993 మార్కులను, 14 మంది 992 మార్కులను, 49 మంది 990 మార్కులకుపైగా, 11,083 మంది 925కుపైగా, 13,614 మంది విద్యార్థులు 900పైగా మార్కులను సాధించారన్నారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 467, బైపీసీ విభాగంలో 437 లాంటి అత్యుత్తమ మార్కులతో పాటు 14,635 మంది 425 మార్కులకు పైగా, 20,278 మంది విద్యార్థులు 400 మార్కులకుపైగా సాధించారన్నారు.
ఎస్ఆర్ విద్యాసంస్థల విజయభేరి
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ విద్యార్థులు విజయభేరీ మోగించారని ఆ అకాడమీ ఛైర్మన్ ఎ.వరదారెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో ఒకరు 992, ఇద్దరు విద్యార్థులు 990 మార్కులు, ఎంపీసీలో ఆరుగురు 991 మార్కులు, ఏడుగురు విద్యార్థులు 990కి పైగా మార్కులు, ఎంఈసీలో ఒకరు 983, సీఈసీలో ఒకరు 979 మార్కులు సాధించారని చెప్పారు.
అల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చూపారని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఇ.నవ్యశ్రీ 994 మార్కులు, బైపీసీలో ఎ.అర్చన 993, ఎంఈసీలో జి.శ్రీచక్రిత 986, ప్రథమ సంవత్సరం సీఈసీ విభాగంలో పి.శివాని 493 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం పొందారని వివరించారు.
నారాయణ విద్యార్థుల ప్రభంజనం
ఇంటర్ 2022 ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జయకేతనం ఎగురవేశారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు 468 మార్కులను ఏడుగురు సాధించగా అందులో తమ విద్యార్థులే అయిదుగురు ఉన్నారన్నారు. బైపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు 437, 436 మార్కులను పది మంది విద్యార్థులు సాధించారన్నారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 993 మార్కులతో ఇద్దరు, బైపీసీ విభాగంలో 991 మార్కులతో ఇద్దరు స్టేట్ టాప్ సాధించారన్నారు.
రాష్ట్రంలో 459 మందికి కరోనా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 459 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 247 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 4,172 మంది ఐసొలేషన్లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 26,126 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 232, రంగారెడ్డి జిల్లాలో 60, సంగారెడ్డిలో 54 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం మరో 26,040 మందికి టీకాలు పంపిణీ చేశారు.
ప్యాక్స్ సిబ్బందికి త్వరలో కొత్త హెచ్ఆర్ విధానం: కొండ్రు
ఈనాడు, హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(ప్యాక్స్)ల పాలకవర్గాలకు, సిబ్బందికి త్వరలో కొత్త మానవ వనరుల(హెచ్ఆర్) విధానం అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వనుందని రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు(టెస్కాబ్) ఛైర్మన్ కొండ్రు రవీందర్రావు తెలిపారు. ప్యాక్స్ ఛైర్మన్ల వేదిక నేతలు మంగళవారం టెస్కాబ్కు వచ్చి ఆయనను కలసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ప్యాక్స్ ఛైర్మన్లకు గౌరవ వేతనంతో పాటు ప్రొటోకాల్ నిబంధనల అమలుకు, కొత్త హెచ్ఆర్ విధానం తేవడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు.
త్వరలో చేనేత బీమా: ఎమ్మెల్సీ రమణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని చేనేత కార్మికులకు బీమా పథకాన్ని సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని తెరాస ఎమ్మెల్సీ ఎల్.రమణ తెలిపారు. చేనేత అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని, బీమా పథకంతో వారికి మరింత భరోసా కలుగుతుందని తెలిపారు. మంగళవారం రమణ చేనేత శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ను ఆయన కార్యాలయంలో కలిసి బీమా పథకంపై చర్చించారు. త్వరలో మంత్రి కేటీ రామారావు వద్ద విధివిధానాలు ఖరారవుతాయని అధికారులు తెలిపారు.
24 బొగ్గు గనులకు 38 బిడ్లు
‘కోయగూడెం బ్లాక్-3’కు ఒకటి దాఖలు
ఈనాడు, దిల్లీ: దేశంలోని 24 బొగ్గు గనుల్లో వాణిజ్యపరమైన బొగ్గు వెలికితీత కోసం నిర్వహించిన వేలంలో 31 కంపెనీల నుంచి 38 బిడ్లు దాఖలైనట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో సింగరేణి కాలరీస్కు చెందిన కోయగూడెం ఓపెన్కాస్ట్-3 ప్రాజెక్టుకోసం ఒక బిడ్డు దాఖలైంది. ఒడిశాలోని ఘోగ్రాపల్లి మైన్కు అత్యధికంగా ఏడు బిడ్లు వచ్చాయి. వీటిని వివిధ విభాగాలకు చెందిన సాంకేతిక మదింపు కమిటీ విశ్లేషిస్తుంది. తరవాత అర్హత సాధించిన బిడ్డర్ల పేర్లను ఎంపికచేసి ఎలక్ట్రానిక్ వేలంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు.
కృష్ణా ట్రైబ్యునల్ కాలపరిమితి మరో ఏడాది పొడిగింపు
ఈనాడు, దిల్లీ: కృష్ణా ట్రైబ్యునల్ కాలపరిమితిని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర జల్శక్తి శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. 2022 ఆగస్టు 1 నుంచి మరో ఏడాదిపాటు ఈ పొడిగింపు వర్తిస్తుందని ఇందులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 89 (ఏ) (బి) క్లాజ్లను అనుసరించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించే అంశాన్ని కేంద్రం ఈ ట్రైబ్యునల్కు అప్పగించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు నివేదికను సమర్పించడానికి తమకు మరో ఏడాది గడువు కావాలని ట్రైబ్యునల్ కోరిన మీదట జల్శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకొంది. అంతర్రాష్ట్ర జలవివాద చట్టం 1956లోని సెక్షన్ 5(3) కింద దఖలు పడిన అధికారాలను ఉపయోగించి రెండు రాష్ట్రాల మధ్య జలవివాద అంశంపై నివేదిక సమర్పణకు మరో ఏడాది గడువిస్తున్నట్లు జల్శక్తి శాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.
వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలి
ఈనాడు, దిల్లీ: బొగ్గు గని కార్మికులకు ఏడాదిగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ ఒప్పందాన్ని వెంటనే అమలుచేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నేత కె.లక్ష్మారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గతేడాది జులై 1 నుంచి అమలు కావాల్సిన ఒప్పందాన్ని పలు కారణాలతో కోల్ ఇండియా లిమిటెడ్ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఒప్పందాన్ని అమలు చేయకపోతే ఇతర కార్మిక సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...