కరోనా బ్యాచ్ అయినా.. ఇంటర్లో సత్తా చాటారు
ప్రస్తుతం ఫస్టియర్ పాసైన వారు తొమ్మిది, పది తరగతుల్లో పరీక్షలు రాయకుండా ఇంటర్కు వచ్చిన వారే. సెకండియర్ పాసైన వారు పది పరీక్షలు రాయలేదు. మొత్తానికి కరోనా బ్యాచ్గా పేరొందినా తాజా ఫలితాల్లో సత్తా చాటడం విశేషం
ఇంటర్లో సాధారణ స్థాయికి ఉత్తీర్ణత శాతం
ఫస్టియర్లో 63.32%, సెకండియర్లో 67.16% పాస్
అమ్మాయిలదే హవా... బాలుర కంటే 16-18% అధికం
ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ప్రస్తుతం ఫస్టియర్ పాసైన వారు తొమ్మిది, పది తరగతుల్లో పరీక్షలు రాయకుండా ఇంటర్కు వచ్చిన వారే. సెకండియర్ పాసైన వారు పది పరీక్షలు రాయలేదు. మొత్తానికి కరోనా బ్యాచ్గా పేరొందినా తాజా ఫలితాల్లో సత్తా చాటడం విశేషం
ఈనాడు, హైదరాబాద్: కరోనా మహమ్మారి విద్యార్థులను ఆగమాగం చేసినా విద్యా పరంగా వారు మళ్లీ కోలుకున్నారు! ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఇంటర్ ఫలితాలను మంగళవారం విడుదల చేయగా ఉత్తీర్ణత శాతం కరోనాకు ముందు స్థాయిలోనే రావడం విశేషం. ఇంటర్ ఫస్టియర్లో 63.32 శాతం, సెకండియర్లో 67.16 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ను పక్కనబెట్టి కేవలం జనరల్ ఇంటర్నే తీసుకుంటే ఆ శాతం వరుసగా 64.85, 68.68 శాతంగా నమోదైంది. గత డిసెంబరులో వెల్లడైన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కేవలం 49 శాతం మందే పాస్ కాగా....తదనంతరం ప్రభుత్వం అందర్నీ ఉత్తీర్ణులను చేసింది. తాజా ఫలితాల్లో ఏకంగా 67 శాతానికిపైగా పాసయ్యారు. నాంపల్లి విద్యాభవన్లో మంగళవారం ఫలితాలను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘‘గత ప్రథమ సంవత్సరం పరీక్షల్లో అధిక శాతం మంది తప్పారు. దాంతో అప్రమత్తమైన విద్యార్థులు బాగా చదివారు. అధ్యాపకులు కూడా కష్టపడ్డారు. దానివల్లే ఈసారి సెకండియర్లో ఉత్తీర్ణత పెరిగింది’’ అన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పరీక్షల కంట్రోలర్ ఖాలిక్, ఓఎస్డీ సుశీల్కుమార్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నింజె తదితరులు పాల్గొన్నారు.
ఫలితాల ముఖ్యాంశాలు
* ప్రథమ సంవత్సరం జనరల్లో 4,14,380 మందిలో 1,76,992 మందికి 75, ఆపై శాతం మార్కులు(ఏ గ్రేడ్) దక్కాయి. ద్వితీయ సంవత్సరం జనరల్లో 3,92,258 మందికి 1,44,076 మంది ఏ గ్రేడ్ మార్కులు పొందారు.
* ఫస్టియర్లో అబ్బాయిలు, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం వరుసగా 54.25, 72.33 శాతంగా నమోదైంది. సెకండియర్లో 59.21, 75.28 శాతంగా ఉంది. అంటే అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 15-18 అధికం.
* ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్, హనుమకొండ, కుమురంభీం ఆసిఫాబాద్ అగ్రస్థానాల్లో నిలిచాయి. ఫస్టియర్లో మేడ్చల్(76), హనుమకొండ(74), ఆసిఫాబాద్ 72 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ద్వితీయ ఇంటర్లో మేడ్చల్ 78 శాతంతో ప్రథమ, 77 శాతంతో ఆసిఫాబాద్, హనుమకొండ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. రంగారెడ్డి 75 శాతంతో మూడో స్థానంలో ఉంది. మెదక్ ప్రథమ సంవత్సరంలో 40 శాతం, ద్వితీయంలో 47 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో నారాయణపేట 75, 76 శాతాలతో అగ్రగామిగా ఉంది. ఒకేషనల్ ఫస్టియర్లో 34 శాతంతో జగిత్యాల, సెకండియర్లో 47 శాతంతో సిద్దిపేట అట్టడుగున నిలిచాయి.
ప్రైవేట్లో కంటే గురుకులాల్లో ఉత్తీర్ణత ఎక్కువ
ప్రథమ, ద్వితీయలలో ప్రభుత్వ కళాశాలల్లో వరుసగా 47.70, 63.56 శాతం మంది పాసయ్యారు. గురుకులాల్లో ఆ శాతం 73.30, 78.25గా నమోదైంది. ప్రైవేట్ కళాశాలల్లో అది 66.50, 68.30 శాతం.
* ప్రథమంలో 16, ద్వితీయలో 46 మంది ఫలితాలను విత్హెల్డ్లో ఉంచారు.
* హెచ్ఈసీ(చరిత్ర, ఆర్థికశాస్త్రం, పౌరశాస్త్రం) ఫస్టియర్లో 31.80 శాతం, సెకండియర్లో 45.70 శాతం మందే పాసయ్యారు.
* ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 50.70 శాతం, ద్వితీయంలో 60.12 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ప్రయోగ పరీక్షలు జులై 26 నుంచి
తప్పిన విద్యార్థులకు ఆగస్టు 1నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలు జులై 26 నుంచి 30 వరకు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 30-జులై 6మధ్య సంబంధిత కళాశాలల్లో రుసుం చెల్లించాలి. ప్రథమ సంవత్సరంలో అన్నీ పాసైన వారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు.
గ్రూపుల వారీగా అగ్రగణ్యులు వీరే..
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఎంపీసీ గ్రూపులో 994 మార్కులతో ఇద్దరు, బైపీసీలో 993 మార్కులతో నలుగురు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కులు సాధించారు.
సెకండియర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారి వివరాలు
* ఎంపీసీ గ్రూపు: ఎన్నం నవ్యశ్రీ(994)-కరీంనగర్, చిలుకా సాయి కీర్తన్(994)-నిజామాబాద్
* బైపీసీ గ్రూపు: ఆకుల అర్చన(993)-కరీంనగర్, మైసా మనస్వని(993)- బాచుపల్లి, రంగారెడ్డి జిల్లా, షేక్ నుహ తన్సీమ్(993)-సాయినగర్, కూకట్పల్లి, నేహ త్రిషిక(993)- సాయినగర్, కూకట్పల్లి మేడ్చల్ జిల్లా
* సీఈసీ గ్రూపు: షరీన్ బేగం(981)- ఫలక్నుమా, హైదరాబాద్ జిల్లా
* హెచ్ఈసీ గ్రూపు: నాంపల్లి నాగలక్ష్మి(977)-కొంపల్లి, మేడ్చల్ జిల్లా
* ఎంఈసీ గ్రూపు: గంట శ్రీ చక్రిత(986)- కరీంనగర్, పిల్లి హర్షిత(986)- హైదర్నగర్, కూకట్పల్లి, మేడ్చల్ జిల్లా; నేలబొట్ల సాయి మనోజ్ఞ(986)-లక్డీకాపుల్, హైదరాబాద్ జిల్లా
సర్కారు కళాశాలల్లో అగ్రగణ్యులు వీరే..
* ఎంపీసీ గ్రూపు: జెల్లా అమన్(990)- ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిర్పూర్ కాగజ్నగర్, కుమురం భీం జిల్లా. కొర్రా మేఘన సింధు(990)- ప్రభుత్వ కళాశాల హసన్పర్తి, హనుమకొండ జిల్లా
* బైపీసీ గ్రూపు: మదిహ ఫిర్దోస్(983)- హైదరాబాద్ మలక్పేట ప్రభుత్వ బాలికల కళాశాల
* ఎంఈసీ: డీవీఎల్ఎన్ఎస్ మృదుల(961)- హైదరాబాద్ మారేడ్పల్లి జూనియర్ కళాశాల
* సీఈసీ: నూర్ ఫాతిమా(963)- కుత్బుల్లాపూర్ ప్రభుత్వ కళాశాల, మేడ్చల్ జిల్లా
* హెచ్ఈసీ: అఫ్రా తహూర్(926)- ప్రభుత్వ బాలికల కళాశాల, జగిత్యాల
రీకౌంటింగ్కు రేపటి నుంచి దరఖాస్తులు
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ పరీక్ష పత్రాల పునఃపరిశీలనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్బోర్డు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 30 నుంచి జులై 6లోపు http://tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పరీక్షపత్రాల రీకౌంటింగ్ కోసం ఒక్కో పత్రానికి రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన పరీక్షపత్రాలతోపాటు వెరిఫికేషన్ కోసం ఒక్కో పత్రానికి రూ.600 చొప్పున చెల్లించాలి.
11 నుంచి ఫస్టియర్ తరగతులు
రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను జులై 11 నుంచి ప్రారంభించాలని బోర్డు కార్యదర్శిని ఆదేశించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు బుధవారం కాలపట్టిక విడుదల చేస్తామని బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం(2022-23) రాష్ట్రంలో కొత్త జూనియర్ కళాశాలలు మంజూరు కాలేదని చెప్పారు.
ఎంపీసీలోనే అత్యధిక ఉత్తీర్ణత
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో మిగతా గ్రూపులతో పోల్చితే ఎంపీసీ విద్యార్థులే అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. హెచ్ఈసీ విద్యార్థులు అత్యల్ప ఉత్తీర్ణత పొందారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి