అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనండి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జులై 4న నిర్వహించే అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాలని ప్రముఖ సినీనటుడు చిరంజీవిని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన
4న భీమవరం రావాలని చిరంజీవికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జులై 4న నిర్వహించే అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాలని ప్రముఖ సినీనటుడు చిరంజీవిని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన లేఖ రాశారు. 4న భీమవరంలో జరిగే కార్యక్రమం, సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని, అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చిరంజీవికి రాసిన లేఖలో కిషన్రెడ్డి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజుకు గౌరవసూచకంగా 2023 జులై 4 వరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం వివిధ కార్యక్రమాల్ని నిర్వహించనున్నట్లు వివరించారు. అవి విజయవంతమయ్యేలా సహకారం అందించాలని కోరారు. లేఖలో కిషన్రెడ్డి కేంద్ర పర్యాటకశాఖ మాజీ మంత్రిగా చిరంజీవిని ప్రస్తావించారు.
కృష్ణంరాజు, కృష్ణలకు కూడా...
భీమవరం పట్టణం, న్యూస్టుడే: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు రెబల్స్టార్ కృష్ణంరాజు, సూపర్స్టార్ కృష్ణలను కూడా నిర్వాహకులు ఆహ్వానించినట్లు తెలిసింది. సీతారామరాజు జీవితచరిత్రపై తీసిన సినిమాలో నటించిన సూపర్స్టార్ కృష్ణను భీమవరం తీసుకొచ్చే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. ఉత్సవ కమిటీకి గౌరవాధ్యక్షునిగా కృష్ణను నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె