అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనండి

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జులై 4న నిర్వహించే అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాలని ప్రముఖ సినీనటుడు చిరంజీవిని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన

Published : 29 Jun 2022 03:56 IST

 4న భీమవరం రావాలని చిరంజీవికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జులై 4న నిర్వహించే అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాలని ప్రముఖ సినీనటుడు చిరంజీవిని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన లేఖ రాశారు. 4న భీమవరంలో జరిగే కార్యక్రమం, సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని, అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చిరంజీవికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజుకు గౌరవసూచకంగా 2023 జులై 4 వరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం వివిధ కార్యక్రమాల్ని నిర్వహించనున్నట్లు వివరించారు. అవి విజయవంతమయ్యేలా సహకారం అందించాలని కోరారు. లేఖలో కిషన్‌రెడ్డి కేంద్ర పర్యాటకశాఖ మాజీ మంత్రిగా చిరంజీవిని ప్రస్తావించారు.

కృష్ణంరాజు, కృష్ణలకు కూడా...

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలకు రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, సూపర్‌స్టార్‌ కృష్ణలను కూడా నిర్వాహకులు ఆహ్వానించినట్లు తెలిసింది. సీతారామరాజు జీవితచరిత్రపై తీసిన సినిమాలో నటించిన సూపర్‌స్టార్‌ కృష్ణను భీమవరం తీసుకొచ్చే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. ఉత్సవ కమిటీకి గౌరవాధ్యక్షునిగా కృష్ణను నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని