హైదరాబాద్ను ఏపీలో చూపుతున్నారు
రాష్ట్ర విభజన జరిగినా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుదారుల చిరునామాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో తెలంగాణ పన్ను రాబడిని కోల్పోతోందని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్రావు జీఎస్టీ మండలి దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ హైదరాబాద్ను
చిరునామాలు మార్చకపోవడంతో రాబడి కోల్పోతున్నాం
జీఎస్టీ మండలి సమావేశంలో మంత్రి హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగినా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుదారుల చిరునామాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో తెలంగాణ పన్ను రాబడిని కోల్పోతోందని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్రావు జీఎస్టీ మండలి దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ హైదరాబాద్ను ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లుగా చూపుతున్నారని చెప్పారు. ‘‘రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయింది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదేళ్లయింది. పన్ను చెల్లింపుదారులు తెలంగాణలోనే ఉన్నా చిరునామాలో మాత్రం ఏపీలోనే ఉన్నట్లుగా పరిగణిస్తున్నారు’’ అని వివరించారు. చండీగఢ్లో మంగళ, బుధవారాల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో హరీశ్రావు, రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వాణిజ్య పన్నులశాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో హరీశ్రావు మాట్లాడిన అంశాలపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘‘జీఎస్టీఆర్-3 బీ రిటర్న్లలో ప్రతికూల విలువలను అనుమతించాలని ప్రతిపాదించినందుకు మండలికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పన్ను చెల్లింపుదారుల చిరునామాలలో తప్పులను సరిదిద్దడానికి అవకాశం ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాలకు మళ్లించిన ఐజీఎస్టీని రికవరీ చేయడానికి రాష్ట్రం వెలుపల ఉన్న పన్ను చెల్లింపుదారుల అంశంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల సహకారం కావాలని కోరారు. ఈ అంశంలో కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి.. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించిన స్వచ్ఛ పరికరాలకు పన్ను మినహాయిపుల జాబితాను విస్తరించాలని కోరారు. స్థానిక సంస్థలు ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఈ నేపథ్యంలో వాటిపై భారాన్ని తగ్గించాలని మండలి దృష్టికి తెచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న మండలి.. అధ్యయనం కోసం ఫిట్మెంట్ కమిటీకి పంపి ప్రతిపాదనలను రూపొందించాలని సూచించింది. జీఎస్టీ అప్పిలేట్ ప్రతిపాదించిన నిబంధనలు గందరగోళంగా, ఆచరణకు వీలుగాలేవని హరీశ్రావు పేర్కొనగా కేంద్ర ఆర్థిక మంత్రి అంగీకరించారు. ఈ నిబంధనల అంశాన్ని మంత్రుల కమిటీకి అప్పగించారు. దీనిపై ఆగస్టు ఒకటో తేదీలోపు ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. గోవా అభ్యర్థనను అంగీకరించి క్యాసినోల జీఎస్టీని ఆమోదించినట్లు గుర్రపు పందేల అంశంలోనూ నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరగా దీన్ని అంగీకరించిన ఛైర్పర్సన్ ఈ అంశంపై జులై 15 లోపు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు’’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో వివరించింది.
చండీగఢ్ పీజీఐని సందర్శించిన వైద్య మంత్రి హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ‘చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి’ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు బుధవారం సందర్శించారు. చండీగఢ్లో జరుగుతున్న జీఎస్టీ మండలి సమావేశంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్లిన వైద్య మంత్రి పీజీఐ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆసుపత్రి సంచాలకుడు డాక్టర్ వివేక్లాల్, డీన్ డాక్టర్ పురి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్ కౌశల్ తదితరులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. ఆసుపత్రిలో అందిస్తోన్న సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆరోగ్య రంగ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వైద్య మంత్రి వారికి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో హైదరాబాద్లో నిమ్స్ విస్తరణ, నగరం నలువైపులా టిమ్స్ పేరిట నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్లో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు తదితర అంశాలను వివరించారు. మరింత మెరుగైన వసతులు, సేవలు అందించడానికి అవసరమైన సూచనలు, సలహాలను ఈ సందర్భంగా పీజీఐ చండీగఢ్ నిపుణుల నుంచి స్వీకరించారు. మంత్రి వెంట వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ టి.గంగాధర్, నిమ్స్ సంచాలకుడు డాక్టర్ మనోహర్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ