ఎన్టీఆర్‌పై వెబ్‌సైట్‌

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని ఆయన పేరుతో శత జయంతి ఉత్సవ సంఘం ‘100 ఇయర్స్‌ ఆఫ్‌ ఎన్టీఆర్‌ డాట్‌ కాం’ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది.

Published : 30 Jun 2022 06:24 IST

ప్రారంభించిన చంద్రబాబు

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని ఆయన పేరుతో శత జయంతి ఉత్సవ సంఘం ‘100 ఇయర్స్‌ ఆఫ్‌ ఎన్టీఆర్‌ డాట్‌ కాం’ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది. దాన్ని తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ ఈ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల నుంచి డిజిటల్‌ సంతకాలను సేకరిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్‌ తరాలపాటు జనం గుండెల్లో నిలిచిపోయే మహానుభావుడని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కనపర్తి రవిప్రసాద్‌, కార్యదర్శి తుమ్మల రమేష్‌, సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని