బీమా మొత్తం చెల్లించాల్సిందే..
పాలసీదారుకు అంగవైకల్యం ఉన్నా.. బీమా పాలసీలో పేర్కొన్న మేరకు మరణానంతర ప్రయోజనాలను చెల్లించాలని బజాజ్ అలియాంజ్ లైఫ్ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. వరంగల్కు చెందిన మీరా
పోలియో ఉందన్న కారణంతో నిరాకరించరాదు..
‘బజాజ్’ సంస్థకు వినియోగదారుల కమిషన్ ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: పాలసీదారుకు అంగవైకల్యం ఉన్నా.. బీమా పాలసీలో పేర్కొన్న మేరకు మరణానంతర ప్రయోజనాలను చెల్లించాలని బజాజ్ అలియాంజ్ లైఫ్ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. వరంగల్కు చెందిన మీరా హుస్సేన్ 2013లో రూ.2.20 లక్షలకు బీమా పాలసీ తీసుకున్నారు. దీని ప్రకారం పాలసీదారు మరణానంతరం బీమా సంస్థ రూ.8.80 లక్షలు చెల్లించాలి. అదే సంవత్సరంలో గుండెపోటుతో మీరా హుస్సేన్ చనిపోగా బీమా సంస్థ ఆయన భార్యకు కనీస బీమా మొత్తం రూ.2.25 లక్షలు మాత్రమే చెల్లించింది. పాలసీదారుకు పోలియో ఉందన్న కారణంతో మరణానంతర ప్రయోజనాలను చెల్లించడానికి నిరాకరించింది. దీంతో హుస్సేన్ భార్య మహమ్మద్ పర్వీన్ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు రాగా.. బీమా సంస్థ రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో అప్పీలు దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న రాష్ట్ర కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్, సభ్యురాలు మీనారామనాథన్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ‘‘పాలసీదారుకు పోలియో ఉన్న మాట వాస్తవమే. అయితే దాని కారణంగా గుండెపోటు వచ్చి మృతి చెందారనడానికి ఎలాంటి ఆధారాలను బీమా సంస్థ చూపలేదు. బీమా క్లెయింను పాక్షికంగా చెల్లించి మిగిలినది నిరాకరించడం సరికాదు. పాలసీలో పేర్కొన్న విధంగా మరణానంతరం రూ.8.80 లక్షలు చెల్లించాల్సిందే. ఇప్పటికే చెల్లించిన కనీస బీమా మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తానికి 2014 నుంచి 7 శాతం వడ్డీతో, ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలి’’ అని తీర్పులో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె