Telangana Inter Results: పదిలో 90 శాతం ఉత్తీర్ణత
కరోనాతో రెండేళ్లు చదువు ఆగమాగమైనా పదో తరగతి ఫలితాల్లో మాత్రం 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత రెండేళ్ల ఉత్తీర్ణత శాతాన్ని పక్కనపెడితే 2019లో అత్యధికంగా 92.43 శాతం మంది పాసయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయి
బాలికలు: 92.45% - బాలురు: 87.61%
97.85 శాతంతో అగ్రస్థానంలో సిద్దిపేట జిల్లా
ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: కరోనాతో రెండేళ్లు చదువు ఆగమాగమైనా పదో తరగతి ఫలితాల్లో మాత్రం 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత రెండేళ్ల ఉత్తీర్ణత శాతాన్ని పక్కనపెడితే 2019లో అత్యధికంగా 92.43 శాతం మంది పాసయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయి ఉత్తీర్ణత అదేకాగా... ఈసారి సాధించిన ఫలితాలు రెండో అత్యధికం. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని 11,402 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయగా...అందులో 3,007 బడుల్లో అందరూ పాసయ్యారని, 15 విద్యా సంస్థల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదని మంత్రి తెలిపారు. గురుకుల పాఠశాలలు 99.32 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని పొందాయన్నారు. విజేతలను అభినందించిన మంత్రి... తప్పిన వారు ఆగస్టు 1వ తేదీ నుంచి మొదలయ్యే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించాలని సూచించారు. టీచర్లు వారానికి ఒకటీ రెండు గంటలు ఆ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకునేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా అందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జిల్లా టెన్త్ ఫలితాల్లో ఏటా చివరి స్థానంలో ఎందుకు ఉంటుందో పోస్టుమార్టమ్ చేస్తామని తెలిపారు. ఇంటర్ లేదా పదో తరగతిలో కొన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులు ఎందుకు వస్తున్నాయో పరిశీలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు పాల్గొన్నారు.
23 జిల్లాల్లో 90 శాతం దాటిన ఉత్తీర్ణత
ఈసారి రికార్డు స్థాయిలో 90 శాతం, ఆపైన ఉత్తీర్ణత సాధించిన జిల్లాలే 23 ఉండటం విశేషం. అందులో 95 శాతానికిపైగా ఉత్తీర్ణులు ఉన్న జిల్లాలు తొమ్మిది ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఏకంగా 97.85 శాతం మంది పాసయ్యారు. 2017, 2018, 2019 సంవత్సరాలలో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఆ తర్వాత రెండేళ్లు కరోనా కారణంగా అందరూ పాసయ్యారు. ఈసారి ఆ జిల్లా 21వ స్థానానికి పడిపోయింది.
పరీక్ష రుసుం జులై 20లోపు చెల్లించాలి
తప్పిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు జులై 20లోపు పరీక్ష ఫీజును ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుంతో సబ్జెక్టు పరీక్ష జరిగే ముందు రెండు రోజుల వరకు చెల్లించవచ్చు. మార్కుల పునఃలెక్కింపు కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 జులై 15లోపు ఎస్బీఐ బ్యాంకు చలానా ద్వారా చెల్లించాలి. పునఃపరిశీలన, జవాబు పత్రాల నకలు కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. పూర్తిచేసిన దరఖాస్తులను ప్రధానోపాధ్యాయులతో ధ్రువీకరణ చేయించి ఆయా జిల్లాల డీఈవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో సమర్పించాలి. గ్రేడ్ మారితేనే సవరించిన ధ్రువపత్రాలను జారీ చేస్తారు.
10 జీపీఏ... లక్షల నుంచి వేలల్లోకి...
ఈనాడు, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో 10కి 10 గ్రేడ్ పాయింట్లు దక్కించుకున్న వారి సంఖ్య గత రెండు సంవత్సరాలు భారీగా ఉండగా... ఈసారి మళ్లీ పూర్వ స్థితికి వచ్చింది. అన్ని సబ్జెక్టుల్లో ‘ఏ1’ మార్కులు(90 శాతం, ఆపైన) పొందిన వారికే 10 జీపీఏ వస్తుంది. కరోనా కారణంగా 2020, 2021లలో పరీక్షలు జరగలేదు. దాంతో ఫార్మేటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్-1 ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. ఫలితంగా 2020లో 1.41 లక్షల మంది, 2021లో 2.10 లక్షల మందికి 10 క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్(సీజీపీఏ) దక్కింది. ఈసారి పరీక్షలు జరగడంతో ఆ సంఖ్య 2019 నాటి కంటే పెరిగినా 11,343తో ఆగిపోయింది. తాజాగా పాసైన విద్యార్థులు 8వ తరగతి పరీక్షలు రాయలేదు. 9వ తరగతిలో నెలన్నర మాత్రమే తరగతులు జరిగాయి. పదో తరగతిలో కూడా సెప్టెంబరు నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి.
83.60 శాతం ప్రైవేట్లోనే
ఈసారి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన 9,484 మందికి 10కి 10 గ్రేడ్ వచ్చింది. అంటే 83.60 శాతంతో సమానం. ఇక మిగిలిన 16 శాతాన్ని ఎయిడెడ్, ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, సంక్షేమ పాఠశాలలు తదితర 11 రకాల విద్యాసంస్థలు పంచుకున్నాయి.
ఎస్సీ గురుకులాల్లో 98.14శాతం ఉత్తీర్ణత
ఈనాడు, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు ప్రతిభ చాటారు. అన్ని గురుకుల సొసైటీల విద్యార్థులు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విద్యార్థుల్ని అభినందించారు.
* సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు 98.14శాతం మంది పాసయ్యారు. 18,545 మందికి 18,200 మంది ఉత్తీర్ణులయ్యారు. సొసైటీ చరిత్రలో తొలిసారిగా 126 పాఠశాలలు 100శాతం ఫలితాలు సాధించాయి. 287 మంది 10జీపీఏ పొందారు.
* మహాత్మ జ్యోతిబాఫులె తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు 97.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 142 గురుకుల పాఠశాలల్లో 77 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. మొత్తం 10,645 మందికి గాను 10,381 మంది పాసయ్యారు. 467 మంది 10 జీపీఏ సాధించారు.
* గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 96శాతం ఉత్తీర్ణత నమోదైంది. 6,287 మందికి 6,557 మంది పాసయ్యారు. 20 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. 44 మంది 10 జీపీఏ సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!