విద్వేషం.. విభజనే భాజపా ఎజెండా
తెలంగాణలో నిర్వహించబోతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అసలైన ఎజెండా విద్వేషం, అసలు సిద్ధాంతం విభజనేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అస్తవ్యస్త విధానాలు, అబద్ధాల
అబద్ధాల పునాదులపై మోదీ పాలన
మీరు ఊతమివ్వకున్నా ప్రగతి సాధించాం
తెలంగాణను చూసైనా నేర్చుకోండి
కొత్త ఆరంభానికి మీకు ఇదే సరైన వేదిక
అంతరాలు లేని సమాజం కోసం ఆలోచించండి
ప్రధానమంత్రికి కేటీఆర్ లేఖ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించబోతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అసలైన ఎజెండా విద్వేషం, అసలు సిద్ధాంతం విభజనేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అస్తవ్యస్త విధానాలు, అబద్ధాల పునాదులపై అసమర్థ పాలన సాగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇక్కడా ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ ప్రధానికి బహిరంగలేఖ రాశారు. సంకుచితత్వాన్ని డీఎన్ఏలోనే నింపుకొన్న భాజపా సమావేశాల్లో.. ప్రజలకు పనికొచ్చే విషయాలను చర్చిస్తారనుకోవడం అత్యాశే అవుతుందన్నారు. కులం, మతం, జాతి ఆధారంగా సమాజాన్ని విడదీసే దుర్మార్గ రాజకీయాల చుట్టూనే చర్చలు సాగుతాయని భావిస్తున్నామన్నారు. సంకుచిత మనస్తత్వం లేని శాంతియుత తెలంగాణ తరఫున స్వాగతిస్తున్నామని, ఇక్కడి సంస్కృతిని నేర్చుకోవాలని సూచించారు. ఇక్కడి గాలి గానం చేసే గంగా జమునా తెహజీబ్ను గుండెల నిండా నింపుకోవాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు-పథకాలు-సుపరిపాలన విధానాలను అధ్యయనం చేయాలని, డబుల్ ఇంజిన్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న భాజపా పాలిత రాష్ట్రాల్లో వీటిని అమలు చేసేందుకు యత్నించాలన్నారు. మత సామరస్యంతో కూడిన వసుధైక కుటుంబం వంటి సమాజం కోసం కొత్త ఆరంభం వైపు అడుగులు వేయాలని సూచించారు.
తెలంగాణతనాన్ని తెలుసుకోండి
‘తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా మారి అద్భుతమైన అభివృద్ధితో ప్రపంచపటంపై తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటున్న హైదరాబాద్.. ప్రపంచ పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను, దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తోంది. భాజపా పాలిత రాష్ట్రాల్లో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులే మిమ్మల్ని తెలంగాణకు రప్పించి ఉంటాయి. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి మీ పార్టీ ఎన్నడూ చేరుకోలేదని అందరికీ తెలుసు. మీ పార్టీ నాయకత్వం మొత్తం హైదరాబాద్లో మకాం పెడుతున్న ఈ సందర్భంలోనైనా కాస్త తెలంగాణతనాన్ని నేర్చుకోవాలి. తెలంగాణ కోటి రతనాల వీణ. సబ్బండ వర్గాల సమాహారం. ఆతిథ్యానికి, ఆదరణకు, ప్రేమాభిమానాలకు ప్రతీక. వినూత్నమైన విధానాలతో, సమ్మిళిత అభివృద్ధి నమూనాతో చరిత్ర సృష్టిస్తున్న ఈ తెలంగాణ గడ్డ మీ రాజకీయాలు, ఆలోచనలను మార్చుకునే అవకాశం ఇస్తోంది. మీ విధానాలను మార్చుకుంటారో.. మిమ్మల్ని మీరే మభ్యపెట్టుకుంటారో మీ ఇష్టం.
మీ వెన్నుపోటును మరిచిపోం
‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అంటూ తెలంగాణ త్యాగాలను చులకన చేసి మాట్లాడిన మీరు ఈ గడ్డ బాగు కోరుతారని ఎవరూ భావించడంలేదు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారబోతున్న హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు పొడిచిన వెన్నుపోటును ఇక్కడి యువత మరిచిపోదు. ఐటీఐఆర్ను రద్దు చేసి తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఆపుదామనుకున్న మీ నికృష్ట రాజకీయాలకు మా పనితీరుతోనే జవాబు చెప్పాం. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులను మూడు రెట్లు పెంచి.. రూ.1.83 లక్షల కోట్లకు చేర్చాం. పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు దక్కిన రాజ్యాంగబద్ధ హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఇవ్వకుండా వంచించిన చరిత్ర మీది. మీరు జాతీయ హోదా ఇవ్వకున్నా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాం. నీతి ఆయోగ్ చెప్పినా మీరు పైసా ఇవ్వలేదు. అయినా మిషన్ భగీరథ, కాకతీయలను పూర్తి చేశాం. మా పల్లె, పట్టణ ప్రగతి పథకాలు దేశానికి ఆదర్శం. మీరు ఒక్క విద్యాసంస్థను కూడా ఇవ్వకున్నా.. గురుకులాలు, వైద్యకళాశాలలను పెద్దఎత్తున విస్తరించాం. మేం చేయని అభివృద్ధి అంటూ ఏమీ లేదు. మీ రాష్ట్రపతి అభ్యర్థిని స్వగ్రామంలో విద్యుత్తు లేదు. కానీ తెలంగాణలో అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్తు ఇస్తున్నాం. మీ పాలనలో ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది. వంటగ్యాస్ సిలిండర్కు ప్రపంచంలోనే అత్యధిక ధర మనదేశంలో ఉంది. సామాన్యుడికి అందుబాటులో లేని నిత్యావసరాలు, పెట్రో ధరలపై దమ్ముంటే ఈ సమావేశాల్లో చర్చించండి. సంక్షేమానికి సరికొత్త అర్థాన్నిచ్చేలా, పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కల్యాణ లక్ష్మి వంటి 450కి పైగా సంక్షేమ పథకాలను అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా అమలు చేయాలి.
దమ్ బిర్యానీ తినండి
హైదరాబాద్లో సంప్రదాయ దమ్ బిర్యానీ రుచి చూడండి. ఇరానీ చాయ్ తాగుతూ ఈ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకండి. అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచించండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి’ అంటూ కేటీఆర్ తన లేఖలో కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు