దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంద జగన్నాథం

మాజీ ఎంపీ మంద జగన్నాథం దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్లపాటు

Published : 02 Jul 2022 03:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ ఎంపీ మంద జగన్నాథం దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారని వెల్లడించింది. గతంలోనూ జగన్నాథం ఈ పదవిలో సేవలందించారు. తాజాగా దిల్లీలో ఆయన సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ జగన్నాథాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించాలని నిర్ణయించారు. తన నియామకంపై జగన్నాథం శుక్రవారం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని