హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా వి.రఘునాథ్‌

తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా వి.రఘునాథ్‌ ఎన్నికయ్యారు. మొత్తం 2685 ఓట్లు పోల్‌కాగా ఆయన 1257 ఓట్లు సాధించగా సమీప ప్రత్యర్థి టి.శ్రీకాంత్‌రెడ్డి 667 ఓట్లు

Published : 02 Jul 2022 04:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా వి.రఘునాథ్‌ ఎన్నికయ్యారు. మొత్తం 2685 ఓట్లు పోల్‌కాగా ఆయన 1257 ఓట్లు సాధించగా సమీప ప్రత్యర్థి టి.శ్రీకాంత్‌రెడ్డి 667 ఓట్లు సాధించారు. 2022-23కుగాను హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కమిటీకి గురువారం ఎన్నిక జరగ్గా అదే రోజు అర్ధరాత్రి దాటాక ఫలితాలు వెల్లడయ్యాయి. 837 ఓట్లతో ఉపాధ్యక్షుడిగా పాశం కృష్ణారెడ్డి, కార్యదర్శులుగా జల్లి నరేందర్‌, గడిపల్లి మల్లారెడ్డిలు 800కు పైగా ఓట్లతో ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా ఎస్‌.సుమన్‌, కోశాధికారిగా ఎం.నాగరాజు, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా రాజు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా పి.కిశోర్‌రావు, కె.కృష్ణకిశోర్‌, బి.కవితా యాదవ్‌, టి.కన్యాకుమారి, ఎన్‌.అనిరుధ్‌, ఇ.రవీందర్‌రెడ్డి, ఆర్‌.పి.రాజు, పి.రాధిక ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని