Current Bill: సెల్ఫోన్తో కరెంటు బిల్లు
మీ ఇంట్లో వాడిన కరెంటుకు మీరే బిల్లు తీసుకోవచ్చు.. వెంటనే ఆన్లైన్లో చెల్లించనూవచ్చు.. ఈ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కసరత్తు చేస్తున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా అమలుకు డిస్కంల యోచన
ఈనాడు, హైదరాబాద్ - భగత్నగర్ (కరీంనగర్), న్యూస్టుడే: మీ ఇంట్లో వాడిన కరెంటుకు మీరే బిల్లు తీసుకోవచ్చు.. వెంటనే ఆన్లైన్లో చెల్లించనూవచ్చు.. ఈ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కసరత్తు చేస్తున్నాయి. తొలుత హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో కరోనా లాక్డౌన్ సమయంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇప్పటివరకూ 10లక్షల మంది ఇలా సెల్ఫోన్ కెమెరాతో వారి ఇంట్లో కరెంటు మీటర్ రీడింగ్ను ఫొటో తీసి బిల్లు చెల్లించారు. నేటికీ చాలామందికి దీనిపై పూర్తిగా అవగాహన లేనట్లు చెప్పారు. గత జనవరిలో నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈ విధానంపై అవగాహన కల్పించడానికి స్టాల్ ఏర్పాటుచేస్తే వేలమంది ఆసక్తి చూపారు.
యాప్ నిక్షిప్తం ఇలా..
స్మార్ట్ఫోన్లో ‘గూగుల్ ప్లే స్టోర్’లోకి వెళ్లి తొలుత మీరు ఏ డిస్కం పరిధిలో ఉంటే దాని యాప్ను డౌన్లోడు చేసుకోవాలి. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణకు ‘టి.ఎస్.ఎన్.పి.డి.సి.ఎల్, దక్షిణ తెలంగాణకు టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్’ అనే డిస్కంల యాప్లున్నాయి. వీటిలో ఏదో ఒక ప్రాంతంలో మీ ఇంటి లేదా దుకాణం, పరిశ్రమ కరెంటు కనెక్షన్ ఉంటుంది. డిస్కం యాప్ డౌన్లోడ్ అయ్యాక, మళ్లీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి ‘భారత్ స్మార్ట్ సర్వీసెస్’ అనే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ను ఓపెన్ చేసి ‘సెల్ఫ్ బిల్లింగ్’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో రాష్ట్రం అనేచోట తెలంగాణ, డిస్కం అనే చోట మీ కనెక్షన్ ఉన్న టి.ఎస్.ఎన్.పి.డి.సి.ఎల్. లేదా టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్.’ ఎంపిక చేసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్లో నల్లా నీటి కనెక్షన్ బిల్లు కోసమైతే ‘హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ’ అనేది ఎంపిక చేసుకోవాలి. ఆ తరవాత మీ కరెంటు కనెక్షన్ ‘యు.ఎస్.సి. లేదా నీటి కనెక్షన్కు అయితే సీఏఎన్ నెంబరును నమోదు చేయాలి. అక్కడ వినియోగదారుడి వివరాలు ప్రత్యక్షమవుతాయి. అప్పుడు మీటరు రీడింగ్ ఫొటో తీయాలి. అది సరిగా రాకపోతే రీడింగ్ అంకెలను నేరుగా నమోదు చేస్తే బిల్లు ఆన్లైన్లో కనిపిస్తుంది. బిల్లు డౌన్లోడు చేసుకుని ఆన్లైన్లో పేమెంట్ ఆప్షన్లోకి వెళ్లి చెల్లిస్తే సరిపోతుంది.
ముందు తీయకుండా...
కరెంటు బిల్లు కచ్చితంగా 30 రోజుల తరవాతే తీసుకోవాలి. సొంతంగా ఫొటో తీసేవారు అంతకన్నా 2, 3 రోజుల ముందు బిల్లు తీసి చెల్లిస్తే.. 30 రోజులయ్యాక డిస్కం సిబ్బంది వచ్చి మళ్లీ బిల్లు తీసి ఇస్తున్నారు. దీనివల్ల ఒకే నెలకు రెండు బిల్లులు వస్తున్నాయి. ఈ సమస్య రాకుండా సెల్ఫోన్తో కరెంటు మీటరు రీడింగ్ ఫొటో తీసినప్పుడు కచ్చితంగా 30 రోజులు పూర్తయితేనే బిల్లు కనిపించేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని దక్షిణ డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. ఇది పూర్తయ్యాక, సాఫ్ట్వేర్లో మార్పులు చేశాక అందరికీ సెల్ఫ్బిల్లింగుపై అవగాహన కల్పిస్తామన్నారు. అది పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక వినియోగదారులకు రాయితీ ఇచ్చే అంశంపైనా నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు
టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో..
విద్యుత్తు బిల్లును సెల్ఫోన్లోని యాప్ సాయంతో సొంతంగానే తీసుకునే ప్రక్రియ టి.ఎస్.ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో 2020 ఏప్రిల్లో మొదలైంది. కరోనా లాక్డౌన్ కాలంలో సుమారు రెండు లక్షల మంది అక్కడ ఆ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రతినెలా ఆ సదుపాయాన్ని కొత్తగా వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1500-2000 మధ్య నమోదవుతున్నట్లు వివరించారు. 10 కిలోవాట్లలోపు విద్యుత్తు సామర్థ్యం ఉన్న వినియోగదారుడు మీటర్ రీడింగ్ను స్మార్ట్ఫోన్లో తీసుకునే అవకాశాన్ని విద్యుత్తు సంస్థ కల్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట