సంక్షిప్త వార్తలు
తెలంగాణ టీఈటీ(పేపర్-1)లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి జంధ్యాల అంజని మొదటి ర్యాంకు సాధించారు. ఆమెకు మొత్తం 133 మార్కులు వచ్చాయి.
టెట్లో ప్రకాశం యువతికి తొలి ర్యాంకు
నాగులుప్పలపాడు, న్యూస్టుడే: తెలంగాణ టీఈటీ(పేపర్-1)లో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి జంధ్యాల అంజని మొదటి ర్యాంకు సాధించారు. ఆమెకు మొత్తం 133 మార్కులు వచ్చాయి.
సమ్మె విరమించిన డాక్టర్ల సంఘం
ఈనాడు, హైదరాబాద్: సమ్మె విరమిస్తున్నట్లు సీనియర్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తమ సమస్యల పరిష్కారానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నుంచి పూర్తిస్థాయి హామీ వచ్చినందున సమ్మెను విరమిస్తున్నట్లు పేర్కొంది.
516 మందికి కరోనా పాజిటివ్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం 516 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తం 26,976 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 631 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. శనివారం 434 మంది కరోనా నుంచి కోలుకున్నారని, రాష్ట్రంలో రికవరీ రేటు 98.89 శాతంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత నెల జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన జేఈఈ(జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్) మెయిన్ మొదటి విడత పేపర్-1, 2 పరీక్షల ‘ప్రాథమిక కీ’ని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) శనివారం రాత్రి వెబ్సైట్లో విడుదల చేసింది. కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చని తెలిపింది. అందుకోసం ఒక్కో ప్రశ్నకు రూ.200లు వంతున చెల్లించాలని ఎన్టీఏ పేర్కొంది.
‘ఆదర్శ’లో ఇంటర్ దరఖాస్తుకు తుదిగడువు 10
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉందని మోడల్ స్కూల్స్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉషారాణి శనివారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలను www.tsmodelschools.com వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలన్నారు.
‘మూడు నెలలుగా జీతాలు లేవు’
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని సగం జిల్లాలకు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులకు ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు అందలేదని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, అధికార ప్రతినిధి సయ్యద్ జబీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు మంజూరు చేయాలని వారు కోరారు.
అదనపు ముఖ్య ఎన్నికల అధికారిగా మాణిక్రాజ్
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో)గా మాణిక్రాజ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. అదనపు సీఈవోగా ఉన్న బుద్ధ ప్రకాష్ను ప్రభుత్వం ఇటీవల రవాణా శాఖ కమిషనర్గా బదిలీ చేసింది. బుద్ధ ప్రకాష్ నుంచి మాణిక్రాజ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
-
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది.