ఆవిష్కరణల దిశగా ఐఐటీ హైదరాబాద్
రెండోతరం ఐఐటీల్లో మంచి పేరు సంపాదించి ఆవిష్కరణల దిశగా దూసుకెళ్తున్న ఐఐటీ హైదరాబాద్ శనివారం కీలక ఘట్టాలకు వేదికైంది. కొత్తగా రెండు నూతన కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రీన్కో, ఇఫ్లూ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
అందుబాటులోకి నూతన సదుపాయాలు
టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్, రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్ల ప్రారంభం
ఉద్యోగాలు సృష్టించే విద్యార్థులు తయారుకావాలి
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఈనాడు, సంగారెడ్డి : రెండోతరం ఐఐటీల్లో మంచి పేరు సంపాదించి ఆవిష్కరణల దిశగా దూసుకెళ్తున్న ఐఐటీ హైదరాబాద్ శనివారం కీలక ఘట్టాలకు వేదికైంది. కొత్తగా రెండు నూతన కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రీన్కో, ఇఫ్లూ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. బీవీఆర్ మోహన్రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్కు కేంద్ర మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్, రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్లను ప్రారంభించి మాట్లాడారు. కేవలం ఉద్యోగాలు, మెరుగైన ప్యాకేజీలు సంపాదించే వాళ్లుగా కాకుండా... ఉద్యోగాలను సృష్టించే వాళ్లుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. పారిశ్రామిక విప్లవం 4.0లో భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు. కరోనా సమయంలో హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్, పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కార్యక్రమాల్లో ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు బీవీఆర్ మోహన్రెడ్డి, గ్రీన్కో సీఈవో అనిల్కుమార్, ఇఫ్లూ ఉపకులపతి సురేష్, సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీలో కొత్తగా వచ్చిన సదుపాయాల ప్రత్యేకతలు... ఒప్పందాల వల్ల విద్యార్థులకు ఒనగూరే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
ప్రయోగశాలలన్నింటికీ ఒకే కాంప్లెక్స్
ఐఐటీ హైదరాబాద్లో మొత్తం 18 విభాగాలున్నాయి. 1000 మందికి పైగా పరిశోధక విద్యార్థులున్నారు. వారికి అవసరమైన మౌలిక వసతులను సమకూర్చే లక్ష్యంతో ‘రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్’ను జైకా సహకారంతో నిర్మించారు. నాలుగు అంతస్తుల ఈ భవనంలో 48 ప్రయోగశాలలున్నాయి. బయోటెక్, బయోమెడికల్ అంశాల్లో పరిశోధనలకు అనువుగా అవసరమైన జంతువులనూ అందుబాటులో ఉంచనున్నారు.
అంకురాలకు ఊతమిచ్చేలా...
ఐఐటీలో ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్’ అందుబాటులోకి వచ్చింది. తొలి నుంచి ఇక్కడ ఆవిష్కరణలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటి వరకు 100 అంకురాలు కార్యకలాపాలు ప్రారంభించాయి. దాదాపు 800 మందికి ఉపాధి చూపించాయి. రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవన్నీ ఆయా విభాగాలకు చెందిన గదుల్లో ఉన్నాయి. వీటిని టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్కులోకి మార్చనున్నారు. అయిదంతస్తుల ఈ భవనంలో మొత్తం 11 బ్లాకులున్నాయి.
మాండరిన్ నేర్పించి.. భాషా సమస్య తీర్చేలా
ఎలక్ట్రానిక్స్ రంగంలో తైవాన్తో కలిసి ఐఐటీ హైదరాబాద్ విస్తృతంగా పరిశోధనలు సాగిస్తోంది. ఐఐటీల్లోనే తొలిసారిగా బీటెక్లో మైక్రోఎలక్ట్రానిక్స్ కోర్సును అందుబాటులోకి తెస్తోంది. తైవాన్తో కలిసి పనిచేస్తోన్నందున భాషా సమస్య ఉత్పన్నమవుతోంది. అందుకే విద్యార్థులకు మాండరిన్తో పాటు ఇతర విదేశీ భాషలు నేర్పించాలని ఇఫ్లూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
దేశంలోనే తొలిసారిగా... సరికొత్త స్కూల్
వాతావరణ మార్పులు ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్. దీనికి పరిష్కారం చూపేలా ఐఐటీ హైదరాబాద్ గ్రీన్కో సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఐఐటీ ప్రాంగణంలో ‘గ్రీన్కో స్కూల్ ఆఫ్ సస్టెయినబుల్ సైన్స్, టెక్నాలజీ’ని సంవత్సరంలో నెలకొల్పనున్నారు. యూజీ నుంచి పీజీ, పీహెచ్డీ వరకు కోర్సులు అందించనున్నారు. ఇందుకోసం తాము రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయని గ్రీన్కో సీఈవో చలమలశెట్టి అనిల్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!