అట్టహాసం.. కమల దరహాసం
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అన్ని ప్రాంతాలను భారీగా భాజపా జెండాలు, స్వాగత తోరణాలతో అలంకరించారు. సమావేశాల వేదిక అయిన నోవాటెల్, హైటెక్స్ ప్రాంతాన్ని కాషాయమయం చేశారు.
సందడిగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
తరలివచ్చిన జాతీయ నేతలు, కేంద్రమంత్రులు, సీఎంలు
ఈనాడు - హైదరాబాద్
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అన్ని ప్రాంతాలను భారీగా భాజపా జెండాలు, స్వాగత తోరణాలతో అలంకరించారు. సమావేశాల వేదిక అయిన నోవాటెల్, హైటెక్స్ ప్రాంతాన్ని కాషాయమయం చేశారు. కళా బృందాల ప్రదర్శనలు, నృత్యాలు, కోలాటాలతో ప్రాంగణం సందడిగా మారింది. ఉదయం 148 మంది భాజపా పదాధికారుల సమావేశం జరిగింది. మధ్యాహ్నం భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, రాజ్యసభలో భాజపా పక్షనేత, కేంద్రమంత్రి పీయూష్ గోయల్లు ఈ వేదికపై ఆసీనులయ్యారు. 18 భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు మొత్తం 348 మంది పాల్గొన్నారు. ప్రధాని మోదీ సమావేశ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే వారంతా నిలబడి ‘భారత్మాతాకీ జై’ అంటూ గట్టిగా నినదించి హర్షధ్వానాలు చేశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మాజీ ఎంపీ వివేక్లు ప్రధాని మోదీని వేదికపైకి స్వాగతించగా, నడ్డాను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, రాజ్యసభ నేత పీయూష్ గోయల్ను శాసనసభ్యుడు ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్రెడ్డిలు ఆహ్వానించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ముగ్గురు ముఖ్యనేతలను వేదికపైకి ఆహ్వానించారు. మోదీ, నడ్డా, పీయూష్గోయల్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు. వేదికపై భాజపా అగ్రనేతలు శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్దయాళ్ ఉపాధ్యాయ, భారతమాత చిత్ర పటాలను ఏర్పాటు చేశారు.
నేతలకు ప్రధాని పలకరింపు
బేగంపేట నుంచి హెచ్ఐసీసీకి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్న ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని పలువురిని నవ్వుతూ పలకరించారు. సమావేశాలకు వచ్చిన పార్టీ నేతల్ని ఎమ్మెల్యే రఘునందన్రావు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డిలు ఆహ్వానించారు.
పొంగులేటిజీ సన్నబడాలి!
భాజపా రాష్ట్ర నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రధానికి స్వాగతం పలికిన సందర్భంగా అయనను ఉద్దేశించి లావు అవుతున్నారు...సన్నబడాలి అని అనడంతో అందరూ నవ్వేశారు.
నేడూ కొనసాగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలు
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం కూడా కొనసాగనున్నాయి. రెండో రోజు రాజకీయ తీర్మానంపై చర్చించనున్నట్లు తెలిసింది. అనంతరం సాయంత్రం ఆరుగంటలకు పరేడ్ మైదానంలో బహిరంగసభ జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వమంతా హైదరాబాద్లో..
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కీలకనేతలు సహా కేంద్రమంత్రులంతా హైదరాబాద్లో ఉండటంతో కేంద్ర ప్రభుత్వమే హైదరాబాద్లో ఉన్నట్లుగా మారింది. సుమారు 40 మంది కేంద్రమంత్రులు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రావడం ప్రత్యేకతగా నిలిచింది.ఈ సమావేశాల నేపథ్యంలో దిల్లీ నుంచి జాతీయ మీడియా ప్రతినిధులు సుమారు వందమందికిపైగా వచ్చారు.
తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్నది వీరే..
తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ముఖ్య నేతలు కె.లక్ష్మణ్, మురళీధర్రావు, డి.కె.అరుణ, జి.వివేక్, ఈటల రాజేందర్, జితేందర్రెడ్డి, గరికిపాటి మోహన్రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, విజయశాంతి, బాల సుబ్రమణ్యం, ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి హాజరయ్యారు. ఏపీ నుంచి కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి, భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్, ఎమ్మెల్సీ మాధవ్లు పాల్గొన్నారు.
తెలంగాణలో భాజపా విజయం ఖాయం: ఖుష్బూ
తెలంగాణలో భాజపా విజయం ఖాయమని సినీనటి, భాజపా నాయకురాలు ఖుష్బూ అన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక వద్ద శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనతో విసిగిపోయి ఉన్నారన్నారు. వారు భాజపా పాలనను కోరుకుంటున్నారని వివరించారు. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో తాను పలు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నట్లు ఆమె చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300