దేశీ జాతి.. ఉత్పత్తి నాస్తి
రాష్ట్రంలో నిత్యం అవసరమైనన్ని పాలు ఉత్పత్తి కావడం లేదు. దీంతో డెయిరీలు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల లీటర్లు కొని ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. దేశీజాతి ఆవులు, గేదెల పాల వినియోగంపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నా రాష్ట్రంలో
కృత్రిమ వీర్య నమూనాలకు కొరత
రాష్ట్రంలోని ఏకైక ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రానికి గ్రహణం
మేలుజాతి గిత్తల సంరక్షణపై ప్రభావం
ఈనాడు, హైదరాబాద్ : రాష్ట్రంలో నిత్యం అవసరమైనన్ని పాలు ఉత్పత్తి కావడం లేదు. దీంతో డెయిరీలు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల లీటర్లు కొని ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. దేశీజాతి ఆవులు, గేదెల పాల వినియోగంపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నా రాష్ట్రంలో అలాంటి పశువుల ఉత్పత్తిని అనేక సమస్యలు వేధిస్తున్నాయి. కరీంనగర్లో ఉన్న గిత్తల ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రానికి జీవ భద్రత సమస్యలు ఏర్పడుతున్నాయని ‘రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ’(ఎల్డీఏ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ కేంద్రం ఆవరణలోనే దేవాలయం, కూరగాయల మార్కెట్ వంటి వాటితో పాటు, ఇతర నిర్మాణాలూ వెలుస్తుండటంతో మేలుజాతి గిత్తల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతేడాది 10 ఒంగోలు జాతి గిత్తలను తీసుకురాగా.. వాటికి రోగాలు సోకడంతో వీర్య నమూనాలు సేకరించకుండా వదిలేశారు. కేంద్రంలో ప్రస్తుతం 132 మేలైన గిత్తలున్నాయి. వాటిలో ఒక దేశీజాతి ఒంగోలు, మూడు సాహివాల్, 10 మేహసని జాతికి చెందిన గిత్తల నుంచే వీర్య నమూనాలు సేకరిస్తున్నారు. మిగతావన్నీ సంకర జాతి రకాలే. ఇక్కడి నుంచి ఘనీకృత వీర్య నమూనాలు తీసుకెళ్లి.. పాడి పశువులకు ఇంజెక్షన్ ద్వారా ఇస్తే మేలైన పాడి పశువులు జన్మిస్తాయి. తెలంగాణ ఏర్పడ్డాక 2014-15లో ఇతర రాష్ట్రాల నుంచి వీర్య నమూనాలు తెచ్చినా ఏటా 14 లక్షల పశువులకు మాత్రమే ఇవ్వగలిగారు. ఇప్పుడు 19 లక్షల నమూనాల ఉత్పత్తితో స్వయం సమృద్ధి సాధించారు. కానీ, వీటిలో దేశీజాతి గిత్తలు లేక ఆ జాతి పశువులు ఉత్పత్తి కావడం లేదు. దేశీజాతి ఆవుల ఉత్పత్తికి గుజరాత్కు చెందిన గిర్, సాహివాల్, ఏపీకి చెందిన ఒంగోలు జాతి గిత్తల వీర్య నమూనాల ఇంజెక్షన్లను తమ పాడి ఆవులకు ఇవ్వాలని రైతులు కోరుతున్నారని, అవి తగినన్ని దొరకడం లేదని గోపాలమిత్ర ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. దేశీజాతి పాడి పశువుల ఉత్పత్తికి రైతుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనని.. వాటికన్నా అధిక పాల దిగుబడినిచ్చే హెచ్ఎఫ్, జెర్సీ, ముర్రా తదితర సంకర జాతి గిత్తల వీర్య నమూనాలను ఎక్కువగా సరఫరా చేస్తున్నట్లు ఎల్డీఏ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం ఏర్పడిన తరవాత ఇచ్చిన వీర్య నమూనాల ఇంజెక్షన్లతో 22.50 లక్షల సంకరజాతి దూడలు పుట్టాయని.. వాటి విలువ రూ.4,500 కోట్లని ఈ సంస్థ అధ్యయనంలో తేలింది. రోజుకు 10 లీటర్ల వరకూ పాలు ఇచ్చే సంకర జాతి పశువుల ఉత్పత్తితో గత ఎనిమిదేళ్లలో రూ.16,425 కోట్ల విలువైన 41 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరిగిందని ప్రభుత్వానికి తెలిపింది. రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లిలో మరో ఘనీకృత గిత్తల వీర్య ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారులు ‘ఈనాడు’కు తెలిపారు.
తెలంగాణలో ఉన్న ఏకైక గిత్తల ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రం ఇది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1982 జులై 12న కరీంనగర్కు 5 కిలోమీటర్ల దూరంలో 596.30 ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేశారు. మేలుజాతి గిత్తలకు ఏ రోగాలు సోకకుండా ఉండేందుకు.. 3 కిలోమీటర్ల దూరం వరకూ ఎలాంటి జనావాసాలు లేకుండా సంరక్షించే ఉద్దేశంతో ఇన్ని ఎకరాలు ఇచ్చారు. కానీ, ఇందులో శాతవాహన విశ్వవిద్యాలయానికి 200 ఎకరాలు, పలు ప్రభుత్వ విభాగాలకూ స్థలాలు కేటాయించడం వల్ల 384.07 ఎకరాలు వాటి చేతుల్లోకి వెళ్లిపోయింది. 212.23 ఎకరాలు మాత్రమే మిగిలాయి. ఇక్కడున్న గిత్తలకు జీవభద్రత కరవై రోగాలపాలై నాణ్యమైన వీర్యం ఉత్పత్తి కష్టంగా మారింది. ఫలితంగా నాణ్యమైన అధిక పాల దిగుబడినిచ్చే దేశీజాతి ఆవులు, గేదెలను ఉత్పత్తి చేయాలన్న ఉద్దేశం నీరుగారిపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM