కాకతీయ మెగా జౌళి పార్కుకు మోక్షం?
తెలంగాణలో మెగా జౌళి పార్కును ఏర్పాటు చేస్తామన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటనతో రాష్ట్రంలోని ప్రభుత్వ, పారిశ్రామిక, జౌళి వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అర్హతలు.. వరంగల్ జిల్లా శాయంపేట-చింతలపల్లి
ప్రధాని హామీతో చిగురిస్తున్న ఆశలు
కేంద్ర సాయంతోనే ప్రాజెక్టుకు రూపు!
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో మెగా జౌళి పార్కును ఏర్పాటు చేస్తామన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటనతో రాష్ట్రంలోని ప్రభుత్వ, పారిశ్రామిక, జౌళి వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన అర్హతలు.. వరంగల్ జిల్లా శాయంపేట-చింతలపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మెగా జౌళి పార్కుకు ఉన్నాయి. ప్రధాని తాజా ప్రకటన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మెగా జౌళి పార్కును ఏర్పాటు చేసే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా శాయంపేట-చింతలపల్లి వద్ద కాకతీయ మెగా జౌళి పార్కు ఏర్పాటుకు 2017లో శ్రీకారం చుట్టింది. దీని కోసం 1200 ఎకరాల్లో భూములను సేకరించి రూ.300 కోట్లతో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టింది. భూసేకరణ అనంతరం దాదాపు ఎనిమిది పరిశ్రమలకు స్థలాలను కేటాయించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా దీన్ని తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రతిపాదనలనూ రూపొందించింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులను కల్పించడానికి రూ.897 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయాన్ని కోరింది. గ్రాంటు రూపంలో సాయం అందించాలని కోరగా.. దానిపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా ఏడు మెగా జౌళి పార్కులను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం కేంద్రానికి మరోసారి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర జౌళి, చేనేత శాఖల మంత్రి కేటీఆర్ దాదాపు పదిసార్లు దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, సంతోష్ గంగ్వార్, పీయూష్ గోయల్లను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. బడ్జెట్ సందర్భంగా కూడా లేఖలు రాశారు. అయినా కేంద్రం నుంచి స్పందన లభించలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని తాజా ప్రకటన ఆశాజనకంగా మారింది. కాకతీయ జౌళి పార్కుకు కేంద్రం సాయం అందిస్తే మౌలిక వసతులకు సంబంధించిన పనులు సత్వరమే పూర్తవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీటి సరఫరా, ఆర్వోబీ నిర్మాణం, ఇతర పనులు జరుగుతాయి. ఇప్పటికే అక్కడ భూములు తీసుకున్న వాటిలో సగం సంస్థలు మౌలిక వసతుల కోసం ఎదురుచూస్తూ నిర్మాణ పనులు చేపట్టలేదు. కేంద్రం నుంచి నిధులు వస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే వీలుంది.
వెంటనే మంజూరు చేయాలి: మండల శ్రీరాములు
తెలంగాణకు మెగా జౌళిపార్కు ఇస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ వెంటనే దాన్ని మంజూరు చేయాలని, లేనిపక్షంలో నమ్మే పరిస్థితి ఉండదని రాష్ట్ర చేనేత సంఘాల సమాఖ్య మాజీ అధ్యక్షుడు మండల శ్రీరాములు పేర్కొన్నారు. ప్రధాని ప్రకటన విషయంలో అనేక అనుమానాలున్నాయని ఆయన చెప్పారు.. ఆదివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇప్పటికే విభజన హామీలతో పాటు కొత్త ప్రాజెక్టులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్ సహా మంత్రులంతా ఎన్నోసార్లు విన్నవించినా, లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందించలేదు. హామీలన్నింటిపై ప్రధాని నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా ఒక్కదానిపైనా ఇప్పటివరకు ఆదేశాలు ఇవ్వలేదు’’ అని రాములు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!