హక్కు దక్కదు.. అప్పు పుట్టదు
వారి చేతిలో ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉంది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. కానీ అయిదేళ్లుగా ఆ భూములపై హక్కులు లేక, రుణాలు పొందలేక, రైతుబంధు అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఎసైన్డ్, ఇనాం భూముల
ఎసైన్డ్, ఇనాం లబ్ధిదారులకు తప్పని కష్టాలు
కొత్త పాసుపుస్తకాల జారీలో జాప్యం
విధిలేని పరిస్థితుల్లో అగ్గువకే విక్రయం
ఈనాడు, హైదరాబాద్: వారి చేతిలో ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉంది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. కానీ అయిదేళ్లుగా ఆ భూములపై హక్కులు లేక, రుణాలు పొందలేక, రైతుబంధు అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఎసైన్డ్, ఇనాం భూముల లబ్ధిదారుల పరిస్థితి ఇది. ఈ భూముల్లో ప్రస్తుతం వానాకాలం పంటల సాగుకు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అప్పు పుట్టక ఆయా రైతులు అవస్థలు పడుతున్నారు. 2017 సెప్టెంబరు ముందు వరకు ఈ భూములకు పాత పట్టా పాసుపుస్తకాలు ఉన్నాయి. భూదస్త్రాల ప్రక్షాళన అనంతరం రెవెన్యూశాఖ వీటిలో చాలా భూములకు కొత్త పట్టా పుస్తకాలు జారీ చేయలేదు. భూముల వివరాలను ఆన్లైన్లోనూ నమోదు చేయలేదు. దీంతో వీరికి సమస్యలు మొదలయ్యాయి.
ప్రభుత్వం ఇచ్చినవని చెప్పి..
ఈ భూములు.. ప్రభుత్వం పేదలకు కేటాయించినవి కావడంతో చాలా జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం కొత్త పాసుపుస్తకాలు జారీ చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఇనాం భూములకు అధీన హక్కు పత్రం (ఓఆర్సీ) జారీచేసిన చోట కూడా నేటికీ కొత్త పాసుపుస్తకాలు అందలేదు. కొన్ని జిల్లాల్లో ఇనాం భూముల లబ్ధిదారుల ఖాతాలను రెవెన్యూ దస్త్రాల నుంచి పూర్తిగా తొలగించారు.
అగ్గువకే విక్రయాలు
పాసుపుస్తకాలు అందని రైతులు ధరణి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూశాఖ ప్రకటించిన ప్రతిసారీ వేల మంది మీసేవా కేంద్రాలకు ఆశతో వస్తున్నారు. ఆ భూముల సర్వే నంబరు, ఖాతా నంబరు సైతం ఆన్లైన్లో లేకపోవడంతో వారి దరఖాస్తులను పోర్టల్ స్వీకరించడం లేదు. దీంతో విసిగిపోతున్న బాధితులు.. కుటుంబ అవసరాలకు దిక్కులేని పరిస్థితుల్లో భూములను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. మెదక్, సిద్దిపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వరంగల్ తదితర జిల్లాల్లో ఈ విధంగా వందల ఎకరాల విస్తీర్ణం చేతులు మారుతోంది. బహిరంగ మార్కెట్లో ఎకరా ధర రూ.20 లక్షలు ఉండగా.. ఈ భూములు రూ.3 లక్షలు కూడా పలకడం లేదు. 2018 నాటికి రాష్ట్రంలో 2.41 లక్షల ఎకరాల ఎసైన్డ్ భూములు చేతులు మారినట్లు అధికారిక సమాచారం ఉంది. కొత్త పాసుపుస్తకాలు అందక ఈ నాలుగేళ్లలోనూ పెద్ద ఎత్తున భూమిని పేదలు విక్రయించినట్లు అంచనాలు ఉన్నాయి.
ఆన్లైన్లో సమాచారం ఉంచాలని విన్నపాలు
ప్రభుత్వం కొత్త పాసుపుస్తకాలు జారీచేసే వరకు ఎసైన్డ్ భూముల లబ్ధిదారులు, వారి తరువాత వారసత్వంగా హక్కులు పొందిన వారి వివరాలను ఆన్లైన్లో, ధరణి పోర్టల్లో ప్రత్యేక గవాక్షంలో (విండో) చేర్చాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. దీనివల్ల హక్కుదారులు ప్రైవేటుగానైనా అప్పులు తీసుకునేందుకు వీలవుతుందని చెబుతున్నారు. ధరణి పోర్టల్కు ముందు వెబ్ల్యాండ్ వెబ్సైట్లో ఇదేతీరులో హక్కుదారుల వివరాలు ఉండేవని గుర్తు చేస్తున్నారు. అనేక జిల్లాల్లో ప్రజావాణికి వస్తున్న దరఖాస్తుల్లో ఇలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్