శాసనసభ, మండలిని సందర్శించిన రాజ్యసభ ఐటీ కమిటీ

రాజ్యసభ ఐటీ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ రాకేశ్‌సిన్హా, సభ్యులు ఆదివారం తెలంగాణ శాసనసభ, మండలిని సందర్శించారు. వారికి శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు స్వాగతం పలికారు. ఉభయసభల్లో ఐటీ వినియోగంపై వివరించారు. అనంతరం

Published : 04 Jul 2022 06:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యసభ ఐటీ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ రాకేశ్‌సిన్హా, సభ్యులు ఆదివారం తెలంగాణ శాసనసభ, మండలిని సందర్శించారు. వారికి శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు స్వాగతం పలికారు. ఉభయసభల్లో ఐటీ వినియోగంపై వివరించారు. అనంతరం కమిటీ.. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో భేటీ అయింది. తెలంగాణ రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి, దామోదర్‌రావు, రవిచంద్ర, లింగయ్యలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ, మండలి కార్యకలాపాల గురించి గుత్తా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని