తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి ధర్మ దర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్సులోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రాంభగీచా ప్రాంతం వరకు

Published : 04 Jul 2022 06:19 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి ధర్మ దర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్సులోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రాంభగీచా ప్రాంతం వరకు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 20 గంటలు పడుతోంది. గదులు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీవారిని శనివారం 88,026 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.34 కోట్ల హుండీ కానుకలు లభించాయి. అత్యధికంగా 50,652 మంది తలనీలాలు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని