Telangana News: తెలంగాణ.. స్టార్టప్ ‘సూపర్స్టార్’
దేశంలో స్టార్టప్స్ను ప్రోత్సహించే టాప్ పెర్ఫార్మర్స్ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సోమవారం స్టార్టప్ స్టేట్ ర్యాంకులు విడుదల చేశారు. ఈ రంగంలో పెద్ద (కోటికిపైగా జనాభా), చిన్న (కోటిలోపు...
బెస్ట్పెర్ఫార్మర్స్ గుజరాత్, కర్ణాటక
చివరి స్థానంలో బిహార్ సరసన ఏపీ
ర్యాంకులు విడుదల చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
తెలంగాణలో బలమైన స్టార్టప్ వాతావరణం
కేంద్ర నివేదిక వెల్లడి
ఈనాడు - దిల్లీ
దేశంలో స్టార్టప్స్ను ప్రోత్సహించే టాప్ పెర్ఫార్మర్స్ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సోమవారం స్టార్టప్ స్టేట్ ర్యాంకులు విడుదల చేశారు. ఈ రంగంలో పెద్ద (కోటికిపైగా జనాభా), చిన్న (కోటిలోపు జనాభా) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపిన ప్రతిభ ఆధారంగా వాటిని స్టార్టప్ మెగాస్టార్స్ (బెస్ట్ పెర్ఫార్మర్స్), సూపర్స్టార్స్ (టాప్ పెర్ఫార్మర్స్), స్టార్స్ (ది లీడర్స్), రైజింగ్ స్టార్స్ (యాస్పైరింగ్ లీడర్స్), సన్రైజర్స్ (ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్) పేరుతో అయిదు విభాగాలుగా విభజించారు. ‘‘స్టార్టప్ తెలంగాణ పోర్టల్ రాష్ట్రంలోని స్టార్టప్స్ ఏర్పాటుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందిస్తోంది. స్టార్టప్స్ వ్యవస్థాపకుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి వారి ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తూ మార్గనిర్దేశం చేస్తోంది. తెలంగాణ ఓపెన్ డేటా పాలసీ 2016 ద్వారా విభిన్న డిపార్ట్మెంట్లకు చెందిన డేటాను బహిర్గతం చేస్తూ పరిపాలనలో పారదర్శకతకు పీట వేసింది. మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్లను ప్రోత్సహించడానికి వి-హబ్ పేరుతో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుచేసి వారికి నిధులు, మార్గదర్శనం, ప్రణాళిక, వృద్ధి విషయంలో చేయూతనందిస్తోంది. స్టార్టప్స్కు నిధులు సమకూర్చడానికి టి-ఫండ్ పేరుతో ఒక ఫండ్ను ఏర్పాటు చేయడం, స్టార్టప్స్తో పెట్టుబడిదారులను అనుసంధానం చేయడానికి 15కిపైగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. టి-ఫండ్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లకుపైగా కేటాయించింది. ఇప్పటి వరకు 50కి పైగా స్టార్టప్లు రూ.కోటి నిధులను దీని ద్వారా అందుకున్నాయి. టి-ఫండ్కు అదనంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్జీఎస్టీ వాపసు చేస్తోంది. పనితీరు ఆధారంగా గ్రాంట్ మంజూరు చేస్తోంది. పేటెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇంటర్నేషనల్ మార్కెట్ ఛార్జీలు, ఉద్యోగనియామకాల కోసం చేసే ఖర్చులను తిరిగి చెల్లించడం ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమంలో 800 స్టార్టప్స్, 150 మందికిపైగా భాగస్వాములయ్యారు. స్టార్టప్స్కు అవసరమైన మద్దతు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం 250మందికిపైగా అధికారులకు అవగాహన కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఏర్పడిన ఇంక్యుబేటర్లకు 100% శిక్షణ ఇస్తోంది. 350మందికిపైగా ప్రైవేటు పెట్టుబడిదారులను స్టార్టప్లకు మద్దతిచ్చేలా ప్రోత్సహించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పదికిపైగా డిపార్ట్మెంట్లు స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాయి’’ అని కేంద్రం తాజా నివేదికలో వివరించింది. రాష్ట్రాల పనితీరును లెక్కించడానికి కేంద్రం పరిగణనలోకి తీసుకున్న ఏడు అంశాల్లో నాలుగింట తెలంగాణ లీడర్ జాబితాలో చోటు సంపాదించుకొంది.
వెతికినా కనిపించని ఆంధ్రప్రదేశ్
స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఉత్తమ పద్ధతులు అనుసరిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పదం వెతికినా కనిపించలేదు. కేంద్రం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో చివరి విభాగంలో నిలిచిన బిహార్ పలు ఉత్తమ పద్ధతులను అమలు చేస్తున్నట్లు స్టార్టప్ నివేదిక పేర్కొంది. కానీ ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులేమీ ఇందులో కనిపించలేదు. బిహార్ 2017 స్టార్టప్ పాలసీ విడుదల చేసి రాష్ట్రంలో ఏర్పాటయ్యే స్టార్టప్లకు మార్గనిర్దేశం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 10 స్టేట్ సపోర్టెడ్ మెంటార్స్తో 250కిపైగా సంస్థలు అనుసంధానమైనట్లు తెలిపింది. దేశంలో వెనుకబడిన బిహార్లో కనిపించిన పద్ధతులు కూడా ఏపీలో కనిపించకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రెండురోజుల క్రితం కేంద్ర వాణిజ్యశాఖ ప్రకటించిన సులభతర వాణిజ్యంలో తొలిగ్రూప్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ స్టార్టప్స్ ప్రోత్సాహంలో మాత్రం వెనకబడిపోయినట్లు ఈ నివేదిక ద్వారా వెల్లడైంది.
సామర్థ్యం పెంపు, మార్గనిర్దేశం, నిధులు, ఇంక్యుబేషన్, సంస్థాగత విషయాల్లో మద్దతు, మార్కెట్ అందుబాటు, నవకల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహం ఆధారంగా రాష్ట్రాల స్థాయిని లెక్కించారు. 26 కార్యాచరణ సూత్రాల కొలమానంగా 100 మార్కులకు ఈ ర్యాంకులు ప్రకటించారు.
స్టార్టప్ల సాధికారతకు తెలంగాణ కృషి
తెలంగాణలో బలమైన స్టార్టప్ వాతావరణం ఉన్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇక్కడ ఏర్పాటైన స్టార్టప్లకు మారదర్శకత్వం, ఇంక్యుబేషన్, నిధుల మద్దతు ద్వారా సాధికారత కల్పిస్తున్నట్లు ప్రశంసించింది. 2016-21 తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ నవకల్పన, ప్రయోగాలు, రిస్క్ తీసుకొనే ధైర్యాన్ని నూరిపోసి రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించినట్లు తెలిపింది.
1. మెగాస్టార్స్.. గుజరాత్, కర్ణాటక
2. సూపర్స్టార్స్.. తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా. కేంద్రపాలిత ప్రాంతం నుంచి జమ్మూకశ్మీర్
3. స్టార్స్.. తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, అస్సాం. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అరుణాచల్ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, గోవా
4. రైజింగ్ స్టార్స్.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్గఢ్. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి హిమాచల్ప్రదేశ్, చండీగఢ్, త్రిపుర, దాద్రానగర్హవేలి, మణిపుర్, నాగాలాండ్, పుదుచ్చేరి
5. సన్రైజర్స్.. బిహార్, ఏపీ. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మిజోరం, లద్ధాఖ్
* స్టార్టప్స్ ద్వారా 7,50,704 మంది ఉపాధి పొందుతున్నారు.
* దేశవ్యాప్తంగా రాష్ట్రాల నుంచి నిధుల మద్దతు పొందుతున్న స్టార్టప్లు: 571
* 648 జిల్లాల్లో కనీసం ఒక గుర్తింపు పొందిన స్టార్టప్ ఉంది. దేశవ్యాప్తంగా ఇలాంటి వాటి సంఖ్య 70,809కి చేరింది. వీటిలో 47% స్టార్టప్లలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..
- ఎం.శ్రీనివాస్రావు, సీఈఓ, టి-హబ్
స్టార్టప్ ర్యాకింగ్స్లో తెలంగాణ ముందువరుసలో నిలవడం హర్షణీయం. అంకుర వ్యవస్థను బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ఇక్కడ అమలు చేస్తున్న పలు విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ను ప్రారంభించిన సందర్భంగా, రానున్న అయిదేళ్ల కాలంలో 20వేలకు పైగా అంకురాలకు సేవలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి