మన‘సారా’ తరిమేశారు
పచ్చని ఆ పల్లెలో మద్యం చిచ్చు రేపింది. కుటుంబాల్లో గొడవలు.. పంచాయితీలతో ప్రశాంతత చెదిరిపోయింది. ఈ పరిస్థితి గ్రామానికి చెందిన విద్యావంతులు, యువకుల్లో ఆలోచన రేపింది. ఊరు బాగుపడాలంటే మహమ్మారిని పారదోలాల్సిందేనని గట్టిగా
ఊరి బాగుకు కదిలిన యువత
మూడేళ్లుగా మద్య నిషేధం
ఖమ్మం జిల్లా కొత్త కారాయిగూడెం స్ఫూర్తి
పెనుబల్లి - న్యూస్టుడే
పచ్చని ఆ పల్లెలో మద్యం చిచ్చు రేపింది. కుటుంబాల్లో గొడవలు.. పంచాయితీలతో ప్రశాంతత చెదిరిపోయింది. ఈ పరిస్థితి గ్రామానికి చెందిన విద్యావంతులు, యువకుల్లో ఆలోచన రేపింది. ఊరు బాగుపడాలంటే మహమ్మారిని పారదోలాల్సిందేనని గట్టిగా నిర్ణయించుకున్నారు. సర్పంచి, పోలీసులు, గ్రామస్థుల సహకారంతో సమష్టిగా నిషేధానికి నడుంకట్టారు. మూడేళ్ల క్రితం నిర్ణయం తీసుకుని.. ఇప్పటికీ విజయవంతంగా అమలు చేస్తున్న కొత్త కారాయిగూడెం స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో మూడేళ్ల క్రితం సుమారు 10 మద్యం గొలుసు దుకాణాలు ఉండేవి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచీ మద్యం తాగేందుకు ఇక్కడికి పలువురు వచ్చేవారు. నిబంధనల ప్రకారం బడులు, గుడులకు దూరంగా మద్యం దుకాణాలు ఉండాలి. గ్రామంలో మాత్రం వాటిని ఆనుకొని గొలుసు దుకాణాలు ఉండేవి. కొంతమంది రాత్రిళ్లు బడిలో తాగి సీసాలు అక్కడే పడేసేవారు. గుడుల వద్దా అదే పరిస్థితి. తాగిన మైకంలో గొడవలు.. కుటుంబ కలహాలు చోటుచేసుకునేవి. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. 18 ఏళ్లు నిండనివారూ మద్యం తాగేవారు. గ్రామంలో పరిస్థితి విద్యావంతులు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న గ్రామ యువకుల్ని కదిలించింది. ఊరు బాగుపడాలంటే మద్య నిషేధమే మార్గమని భావించారు. సర్పంచి దొడ్దపనేని శ్రీదేవితో చర్చించారు. యువతకు ఆమె అండగా నిలిచారు. మద్యనిషేధాన్ని అంగీకరిస్తూ తొలుత 300 మంది గ్రామస్థులు సంతకాలు చేశారు. తమ నిర్ణయం గురించి ఎస్సై తోట నాగరాజుకు తెలపగా.. సహకరించేందుకు ముందుకొచ్చారు. 2019 ఏప్రిల్ నుంచి గ్రామంలో మద్యం అమ్మడాన్ని, తాగడాన్ని నిషేధించారు. గ్రామస్థులందరితో మాట్లాడి గొలుసు దుకాణాలను మూసివేయించారు. ఎవరూ ఉల్లంఘించకుండా రాత్రివేళల్లో గస్తీ తిరిగారు. మొదట్లో కొంతమంది ఎదురుతిరిగినా యువత ఎదురొడ్డి నిలిచారు. విజయం సాధించారు. గ్రామంలో మూడేళ్లుగా మద్య నిషేధం విజయవంతంగా అమలవుతోంది. ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేకుండా గ్రామం ప్రశాంతంగా ఉందని.. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని గ్రామస్థుడు నూనె సోమయ్య సంతోషంతో పేర్కొన్నారు.
మంచి పనిలో భాగస్వామ్యం సంతోషంగా ఉంది
- దొడ్డపనేని అనీష్
నేను దుబాయ్లో ఉద్యోగం చేసేవాడిని. ఇంటికి వచ్చినప్పుడల్లా మద్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను చూసి బాధ కలిగేది. గ్రామంలోని యువకులతో మాట్లాడి నిషేధంపై నిర్ణయం తీసుకుని తీర్మానం చేశాం. మంచి పనిలో నా భాగస్వామ్యం ఉండటం సంతోషంగా ఉంది.
గ్రామం ప్రశాంతంగా ఉంది
- దొడ్డపనేని శ్రీదేవి, సర్పంచి
నేను సర్పంచిగా ఎన్నికైన సమయంలో తాగిన మైకంలో కొట్టుకోవడాలు, ఘర్షణలతో నిత్యం పంచాయితీలు జరుగుతుండేవి. మద్య నిషేధంపై తీర్మానిద్దామని గ్రామ యువత చెప్పడంతో సంతోషం వేసింది. వారికి పూర్తి సహకారం అందించాను. పోలీసులకు వినతిపత్రం ఇచ్చాం. ప్రతి గొలుసు దుకాణానికి యువత వెళ్లి మూసివేయాలని చెప్పారు. అప్పటి ఎస్సై తోట నాగరాజు దుకాణదారులను హెచ్చరించడంతో నిషేధం ఆరంభమైంది. మా ప్రయత్నాలకు ఎమ్మెల్యే సహకరించడంతో గ్రామం ప్రశాంతంగా ఉంది.
మద్యం మానేశాక ఆరోగ్యం బాగుపడింది
- మేడా ప్రభాకర్రావు
నిత్యం మద్యం తాగడంతో నా ఆరోగ్యం పాడైంది. ఆసుపత్రికి వెళ్తే రూ.3 లక్షలు ఖర్చయింది. మద్యాన్ని మానేయడంతో ఆరోగ్యం బాగుపడింది. ప్రస్తుతం మామిడి తోటల వ్యాపారం చేస్తున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట